Havey Rain Alert: ఏపీకి మరోసారి వాన గండం పొంచి ఉంది. ప్రస్తుతం పశ్చిమమధ్యబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది రేపు ఉదయం తీరం దాటే ప్రమాదం ఉందంటోంది వాతావరణశాఖ. దీంతో ఏపీ ప్రజల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 300 కి.మీ., గోపాల్పూర్కు 300 కి.మీ., పారాదీప్కు 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని…
త్వరలోనే విశాఖ ఐటీ హబ్గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సంచర్ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 125 కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పుకొచ్చారు. పర్యాటక ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయన్నారు. టెంపుల్ టూరిజంను 8 నుంచి 20 శాతానికి పెంచాలనేది లక్ష్యం అని, పర్యాటకంలో…
Andhra University: ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థులు-అధికారులు మధ్య చర్చలు సఫలం అయ్యారు.. దీంతో, నిరసనను విరమించారు ఏయూ విద్యార్థులు.. విద్యార్థుల హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఆంధ్రా యూనివర్సిటీ వీసీ.. జిల్లా అధికారుల బృందం.. దసరా సెలవులులోగా విద్యార్థుల డిమాండ్లను పూర్తి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.. ఇక, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం త్రీమెన్ కమిటీ నియమించింది ప్రభుత్వం.. DMHO, KGH సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.. మరోవైపు, ఆంధ్రా…
Minister Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థి మృతి చెందడంతో.. ఉద్రిక్తత నెలకొంది.. నిన్నటి నుంచి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.. వీసీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.. అయితే, ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి మృతిపై స్పందించారు మంత్రి నారా లోకేష్.. వర్సిటీలో రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.. నిన్న ఆంధ్రా యూనివర్సిటీలో ఒక విద్యార్ధి ఫిట్స్ వచ్చి చనిపోయారని తెలిపారు.. అయితే, అంబులెన్స్ లో తీసుకెళ్లినా కాపాడలేకపోయాం అన్నారు.. కానీ, కొందరు ఉద్దేశపూర్వకంగా క్లాస్ లు…
Students Protest: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ బంద్ ఉద్రిక్తతలకు దారి తీసింది.. ఏయూ వీసీ రాజీనామా డిమాండ్ తో రెండో రోజు విద్యార్థులు ఆందోళనకు దిగారు.. ఎగ్జామ్స్, క్లాస్ లు బహిష్కరించారు.. క్యాంపస్ లో ర్యాలీలు నిర్వహించారు.. ఏయూ హాస్టల్లో ఓ విద్యార్థి సకాలంలో చికిత్స అందక మృతిచెందిన నేపథ్యంలో.. అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతోనే ఆ విద్యార్థి మృతిచెందాడంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు.. తమ సమస్యలు పట్టించుకోని వీసీ రాజశేఖర్ వెంటనే రాజీనామా చేయాలంటూ ఆయన చాంబర్లోకి దూసుకువెళ్లారు.…
Rithu Sahu Case: బెంగాల్ విద్యార్థిని రీతు సాహు మృతి కేసు విశాఖ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.. కేవలం పోలీసులకే కాదు, విచారణ కమిటీ అధికారులు, కాలేజీ యాజమాన్యం, హాస్టల్ నిర్వాహకులు పాత్రపై నిగ్గు తేల్చాలి.. మొదట పోలీసులు, తర్వాత హైకోర్టు, ఇప్పుడు సీబీఐకి విద్యార్థిని కేసు అప్పగించాలంటూ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. అది 2023 జూలై 14న హాస్టల్ భవనం పైనుంచి పడి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా…
Off The Record: విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ బలమైన రాజకీయ పక్షాలు. పునర్విభజన తర్వాత ఏర్పడిన ఈ స్థానంపై పట్టుసాధించేందుకు ప్రధాన పార్టీలు గట్టిగానే పోరాడుతుంటాయి. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014లో కూటమి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు. ఇక 2019లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ స్వల్ప మెజారిటీతో బయటపడింది. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన విష్ణు నాలుగో స్థానంతో…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ లీడర్స్ చేసిన తాజా కామెంట్స్ ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాము తిరిగి అధికారంలోకి వస్తే... జగన్ అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారంటూ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.. సజ్జల లాంటి నాయకుడు మాట్లాడారంటే..
గంజాయి రవాణాకు, సరఫరాకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న విశాఖలో స్మగ్లర్ల ఆటకట్టించేందుకు పోలీసులు సరికొత్త ప్లాన్ వేసారు.. రైల్లలోను, బస్సుల్లోను, ఇతర వాహనాల్లో వందల కేజీల కొద్ది గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా బోర్డర్లు దాటించేస్తున్నారు.. పెడ్లర్లు, స్మగ్లర్ల ఎత్తుగడలకు పోలీసుల సైతం ఆశ్చర్యపోతున్నారు.. బ్యాగుల్లో, మూటల్లో తరలిస్తున్న గంజాయిను పట్టుకోవడం కష్టతరం అవుతుంది. దీంతో నార్కోటిక్ స్పెషల్ ట్రైనింగ్ పొందిన డాగ్స్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు విశాఖ పోలీసు అధికారులు...
రేపు విశాఖ వేదికగా భారతీయ జనతాపార్టీ 'సారథ్యం' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహి స్తోంది. ఏపీలో సంస్ధాగత బలోపేతం., ఓట్ బ్యాంక్ పెంచుకోవడం లక్ష్యంగా జరుగుతున్న మీటింగ్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేడర్ కు మార్గనిర్ధేశం చేయనున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ సహావిపక్షాలు సాధించిన ఓట్లను తమవైపు తిప్పుకోవడం, స్ధానిక సంస్ధల ఎన్నికలకు సమాయత్తం సభ లక్ష్యమని కమలదళం చెబుతోంది. మరోవైపు, స్టీ ల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నట్టు…