Gudivada Amarnath: రుషికొండ బిల్డింగ్ల కోసం చంద్రబాబు, పవన్, లోకేష్ పోటీ పడుతున్నారు..!
- పవన్ కల్యాణ్ రుషికొండ పర్యటనపై సెటైర్లు..
- రుషి కొండ బిల్డింగ్ కోసం సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్ పోటీ..!..
- మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: కూటమి సర్కార్, వైసీపీ మధ్య రుషికొండపై నిర్మించిన భవనాలపై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. తాజాగా, రుషికొండ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు.. కొన్ని చోట్ల డ్యామేజ్ జరిగినట్టు పేర్కొన్నారు.. ఇక, దానిని ఎలా వినియోగించుకోవాలనే ఆలోచన చేస్తోంది కూటమి ప్రభుత్వం.. అయితే, పవన్ కల్యాణ్ రుషికొండ పర్యటనపై సెటైర్లు వేశారు.. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రుషి కొండ బిల్డింగ్లు వాడుకునేందుకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ పోటీ పాడుతున్నారని విమర్శించారు.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, షాడో సీఎం (లోకేష్) విశాఖ పర్యటనకు వచ్చినప్పటికీ కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడక పోగా చులకనగా మాట్లాడారని మండిపడ్డారు.. రాష్ట్రంలో సెన్సిటివ్ వాతావరణం ఉన్నప్పుడు.. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం.. జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించడం అలవాటుగా మారిందన్నారు.. కూటమి పార్టీ నేతలకు రుషికొండ టూరిస్ట్ డెస్టినేషన్ గా మారింది.. అక్కడ వాతావరణం ఆస్వాదించి, సెల్ఫీ తీసుకుని విమర్శలు చేయడం అలవాటైందని ఎద్దేవా చేశారు..
Read Also: Pre-Nursery Fees In Bengaluru: ఇదేం దోపిడి సామీ.. ప్రీ నర్సరీకి రూ. 1.85 లక్షల ఫీజు వసూల్..
Also Read
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే సీఎం నివాసం కోసం టూరిజం రిసార్ట్ నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు అమర్నాథ్.. ఎన్నికల్లో గెలవడం నుంచి ఇప్పటి వరకు కూటమి పార్టీలకు రుషికొండ ప్రచారాస్త్రంగా మారిందన్నారు.. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్.. జూబ్లీహిల్స్ లో చంద్రబాబు ఇల్లు కడితే అది స్కీమ్ ఇల్లా…? లేక పూరిల్లా…? అని ప్రశ్నించారు. 5 వేల కోట్లు పెట్టి తాత్కాలిక భవనాలు కట్టిన చరిత్ర టీడీపీదని సెటైర్లు వేశారు.. ఇక, పవన్ కల్యాణ్ వెళ్లినప్పుడు POP స్లాబ్ కూలినట్టు విడుదల చేసిన ఫొటోలు ప్రచారం చేస్తున్నారు.. పడిపోవడం కాదు.. కట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.. మరోవైపు, అమరావతిలో అడుగుకి 13 వేలు ఇచ్చి కట్టించిన సెక్రటేరియట్ గతి ఎలా ఉందో అంటూ ఏవీ విడుదల చేశారు.. రుషికొండ లా.. అమరావతిలో కూడా పవన్ కల్యాణ్ ఫొటోషూట్ పెడితే బండారం బయటపడుతుందని పేర్కొన్నారు..
Read Also: Sugali Preethi Case: పవన్ కల్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి కౌంటర్ ఎటాక్..
రుషికొండ మీద అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం GOలో రిసార్ట్ అని పేర్కొనం వెనుక అసలు ఉద్దేశాలు ప్రజలు గమనించాలి అని సూచించారు అమర్నాథ్.. ప్యాలెస్ అని జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయడానికి రుషికొండను వాడుకున్నారన్న ఆయన.. జగన్మోహన్ రెడ్డి ప్యాలస్ అనేది నిజమైతే ఆ విషయాన్ని జీవోలో ఎందుకు ప్రస్తావించలేదు..? అని ప్రశ్నించారు.. ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ గురించి గొంతు చించుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఇప్పుడు ప్రైవేట్పరం అయిపోతుంటే సూక్తులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?