Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Bjp Saradhyam Public Meeting In Vizag On 14th

Saradhyam Public Meeting: ఏపీపై బీజేపీ ఫోకస్‌.. రేపు విశాఖలో ‘సారథ్యం’ భారీ బహిరంగ సభ..

Published Date :September 13, 2025 , 8:52 pm
By Sudhakar Ravula
  • 'సారథ్యం' పేరుతో రేపు బీజేపీ భారీ బహిరంగ సభ..
  • ఏపీలో సంస్ధాగత బలోపేతం., ఓట్ బ్యాంక్ పెంచుకోవడం లక్ష్యం..
  • కేడర్ కు మార్గనిర్ధేశం చేయనున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..
Saradhyam Public Meeting: ఏపీపై బీజేపీ ఫోకస్‌.. రేపు విశాఖలో ‘సారథ్యం’ భారీ బహిరంగ సభ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Saradhyam Public Meeting: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. కూటమిలో భాగస్వామ్యంగా వుంటూనే సంస్ధాగతబలోపేతం కీలకమని భావిస్తోంది. ఈ దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేసేందుకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ‘సారథ్యం’ పేరుతో రైల్వే గ్రౌండ్‌లో జరుగుతున్న మీటింగ్ కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. బీజేపీ ఏపీ నాయకత్వం మొత్తం ఇప్పటికే విశాఖకు చేరుకుంది. సభా ప్రాంగణంతో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లు కాషాయమయం అయిపోయాయి. భారీ హోర్డింగ్స్, బీజేపీ జెండాల రెపరెపలాడుతున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుపుతున్న NDA సాధించిన విజయాలు., ఏపీకి ఇస్తున్న ప్రాధాన్య తను ప్రధానంగా చెప్పబోతోంది బీజేపీ. అదే సమయంలో మారుతున్న రాజకీయ పరిస్ధితులకు అనుగుణంగా నాయకత్వం అనుసరించాల్సిన వ్యూహాలను నడ్డా నిర్ధేశించనున్నారు. ఆ దిశగా ప్రణాళికాబద్ధమైన కార్యా చరణను ప్రకటించే అవకాశం వుంది.

Read Also: CM Chandrababu: ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Also Read

  • Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
  • Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్‌..
  • Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం
  • Land Dispute Turns Violent: స్థల వివాదం.. ఐదుగురు మహిళలపై విచక్షణారహితంగా దాడి..

2024 ఎన్నికల్లో కూటమి వైసీపీ, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయపార్టీలకు ఏపీలో 43శాతం ఓట్లు నమోదయ్యాయి. ఏపీలో బలోపేతం అవ్వాలంటే విపక్షాల ఓట్లను తమవైపు తిప్పుకోవడం కీలకం అనేది బీజేపీ ఆలోచన. ఆ దిశగానే సారథ్యం సభ జరగనుంది. ఆ పార్టీకి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి సత్యకుమార్ యాదవ్‌ పరిశీలించి నాయకత్వానికి సూచనలు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మారిన తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో భారీ ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సారథ్యం పేరుతో ఇప్పటికే జిల్లాల పర్యటనలు పూర్తి చేశారు. చాయ్ పే చర్చ, శోభాయాత్రల ద్వారా స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం, ఎన్నికల సన్నద్ధత వంటివి ప్రధానంగా టూర్లు నిర్వహించారు. ఈ షెడ్యూల్ కు ముగింపుగా సారథ్యం ముగింపు సభను విశాఖలో ఆర్గనైజ్ చేస్తోంది. సారథ్యం సభ ముగిసిన తర్వాత స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరుగుతుంది. ఈ సమావేశం చాలా కీలకమైనదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం, ఏపీ మెడిటెక్ జోన్ కు సంబంధించిన అంశాలపై నడ్డా రివ్యూ చేస్తారు. మరోవైపు, నడ్డా పర్యటనకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఆందోళన మొదలెట్టాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాతే అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు జీవీఎంసీ దగ్గర వామపక్ష పార్టీలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • BJP Saradhyam
  • jp nadda
  • Saradhyam
  • Saradhyam Public Meeting

తాజావార్తలు

  • Jowar Chilla Recipe: జొన్న పిండితో 10 నిమిషాల్లో కరకరలాడే హెల్దీ చిల్లా.. పిల్లలు, పెద్దలు ఎవరూ విడిచిపెట్టరు అంతే..!

  • Kerala Story 2 OTT: ‘కేరళ స్టోరీ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

  • Duvvada Madhuri: టాలీవుడ్ మూవీలో అత్తగా దువ్వాడ మాధురి

  • iQOO 9 SE: 48MP OIS కెమెరా + 120Hz AMOLED – ఐకూ 9 SE ఇప్పుడు అతి చౌకగా! డీల్ మిస్ కాకండి!

  • Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్‌ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions