విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి లేవనెత్తారు. ఇదే అంశంపై ఇటీవల ఆయన విశాఖలో బహిరంగ సభ నిర్వహించగా.. ఈరోజు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులు, పోలీస్ కాల్పుల్లో అమరులైన వారి పేర్లను ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యమం సమయంలో ఏం జరిగిందో ఆనాటి కొన్ని దినపత్రికలు ప్రచురించిన ఆర్టికల్స్ను కూడా పవన్ షేర్ చేశారు. విశాఖ ఉక్కు కోసం ఉద్యమించిన…
ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంటే.. మరోవైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్పరం కానివ్వం అంటూ కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి.. కార్మికుల ఆందోళనకు బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.. అయితే, స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ.. ప్రభుత్వం పాలన మాత్రమే చేయాలి.. వ్యాపారం చెయ్యకూడదన్నది ప్రధాని నరేంద్ర మోడీ పాలసీగా చెప్పుకొచ్చారు.. అందుకే విశాఖ…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… సీఎం వైఎస్ జగన్కు స్టీల్ ప్లాంట్పై చిత్తశుద్ధి ఉంటే… తక్షణమే అఖిపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.. కాసేపటి క్రితం టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. తాజాగా విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై చర్చించారు.. ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించేలా అన్ని శక్తులను కేంద్రీకరించాలని…
మా లక్ష్యం ఒక్కటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు అన్నారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్రావు… స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 64 ఏళ్ల వయస్సులో విజయసాయి రెడ్డి పాదయాత్ర చేశారు. 70 ఏళ్ల వయస్సులో గాజువాక ఎమ్మెల్యే కూడా నిర్వాసితుల కోసం పాదయాత్ర చేశారు.. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికి 3 సార్లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారని గుర్తుచేశారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్న ఆయన.. అయితే, ఢిల్లీలో…
స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంపై నమ్మకం లేదు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 222రోజులుగా మహా ఉద్యమం జరుగుతుంటే మీకు ఇప్పటి వరకు కనిపించలేదా… ఢిల్లీలో ఆందోళనకు వైసీపీ వచ్చింది కానీ మీరు రాలేదు. మీకు ఢిల్లీలో పలుకుబడి వుంది గట్టిగా చెప్పండి….ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అడిగారు. అక్కడకు వెళ్లి కాళ్ళుపట్టుకుని-ఇక్కడ మీసం తిప్పుతావా… ఇక్కడమో బీజేపీతో గుద్దులాట…..అక్కడేమో ముద్దులాటనా అన్నారు. ప్రజలకు నమ్మకద్రోహం చేయవద్దు….చేతకాకపోతే చేతకాదని చెప్పండి .…
విశాఖపట్నం లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన “రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్” ( వైజాగ్ స్టీల్) ను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి చూపుతుంది. ఈ విషయాన్ని టాటా స్టీల్ సి.ఇ.ఓ, మేనేజింగ్ డైరెక్టర్ టి.వి. నరేంద్రన్ నిర్ధారించారు. విశాఖపట్నంలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఉక్కు కర్మాగారం ఇది. భారతదేశంలో సముద్ర తీరాన ఉన్న అతి పెద్దదైన సమగ్ర ఉక్కు కర్మాగారం దీని…
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ధర్నాకు సంఘీభావం తెలిపారు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. క్యాప్టివ్ మైన్స్ ను వైజాగ్ స్టీల్స్ కు ఎందుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదు అన్నారు. పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేద్దాం. మనము ఓట్లు వేస్తే ఉన్న కేంద్ర ప్రభుత్వం… ప్రజల ఆలోచనలకు కట్టుబడి ఉండాలి. ఉక్కు ఫ్యాక్టరీ అమ్మితే సహించేది లేదు… ఆంధ్ర వాళ్ళము చూస్తూ ఉరుకొము. వెస్ట్ బెంగాల్,కేరళలో ప్రభుత్వ రంగ…
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని ఇప్పటికే స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న ఈ పరిశ్రమ ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదంటున్నాయి అన్ని పార్టీలు.. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేశాయి… విశాఖ నుంచి ఇప్పుడు ఆందోళన ఢిల్లీ వరకు చేరింది… బీజేపీ మినహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు.. ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్నాయి.. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై…
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్దాము పాటు పోరాటం చేసి సాధించుకున్నాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీతో కలసి పోరాటం చేస్తాం అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. కోవిడ్ లో వేలాది మంది ప్రాణాలు కాపాడింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంది. ఇప్పుడు దానిని అమ్మితే బావి తరాలు ఏం చేయాలి… అని కేంద్రం ఆలోచన చేయాలి అని తెలిపారు. వైజాగ్ స్టీల్ అప్పును…
పార్లమెంట్ లోపల, బయట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు మిథున్రెడ్డి… విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ధర్నాకు సంఘీభావం తెలిపిన ఆయన.. పరిరక్షణ కమిటీ పోరాటంలో పాలు పంచుకుంటామని తెలిపారు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తామని గుర్తుచేసిన ఆయన.. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మభిమానం అని పార్లమెంట్ లో స్పష్టం చేశామన్నారు.. ఇక, స్టీల్ ప్లాంట్కు గనులను కేంద్ర…