తూర్పుగోదావరి జిల్లా : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని ఈ లేఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు ముద్రగడ పద్మనాభం. ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నామని… కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా… ప్రైవేటీకరణ చేయడం అస్సలు తగదని ఆయన తెలిపారు.
రైతుల సహకారం కోసం మూడు వ్యవసాయ బిల్లులు రద్దు చేసిన మాదిరిగానే భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేటీకరణ విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఙప్తిని దృష్టిలో ఉంచుకుని… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచన విరమించుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు ముద్రగడ పద్మనాభం..