ఆర్.ఎస్.బ్రదర్స్ విశాఖపట్నంలో అతిపెద్ద షోరూమ్ను జగదాంబ సెంటర్లో జనవరి 2న సగర్వంగా శుభారంభం చేసింది. సాగర తీరంలో షాపింగ్ అనుభవాన్ని అందించే ఈ సరికొత్త షోరూమ్.. అటు సంప్రదాయ వస్త్ర ప్రియుల్ని, ఇటు అధునాతన జీవనశైలిని అభిమానించే వారిని సమానంగా ఆకర్షించే స్థాయిలో రూపుదిద్దుకోవటం విశేషం.
Rainbow Children Hospital : పిల్లల ఆరోగ్యం మరియు సంరక్షణ పట్ల పిడియాట్రిక్ సర్జన్లు నిర్వహించు పాత్ర అత్యంత కీలకమైనది. పిల్లల శస్త్రచికిత్స వైద్యులు నిర్వహించు ఈ పనితనమునకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 29వ తేదీని నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నాది. ఈ ఏడాది రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, విశాఖపట్నం వారు పుట్టుకతో వచ్చిన లోపాలను సంక్లిష్టమైన శస్త్రచికిత్సల ద్వారా విజయవంతంగా సవరించుకున్న 15 మందికి పైగా పిల్లలను సత్కరించింది. భారతదేశంలో…
న్యూ ఇయర్ వేడుకలకు సాగర నగరం వైజాగ్ ముస్తాబవుతుండగా.. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి గైడ్లైన్స్ విడుదల చేశారు పోలీస్ కమిషనర్.. ఇవెంట్స్ నిర్వహించాలనుకునే వారి నుండి దరఖాస్తులకు ఆహ్వానించారు.. అయితే, అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ కమిషనర్..
వర్షాల నేపథ్యంలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న దృష్ట్యా.. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు వెల్లడించారు జిల్లా కలెక్టర్..
Rainbow Childrens Hospital: విశాఖపట్నంలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ నిపుణుల బృందం నగరంలోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో కేవలం 33 వారాల నెలలు నిండని కవల శిశువును కాపాడే శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. కేవలం 1.5 కిలోల బరువున్న శిశువుకు పుట్టుకతో వచ్చే గ్లాకోమా, తీవ్రమైన గుండె పరిస్థితిని గుర్తించారు. కేవలం 14 రోజుల వయస్సులో, శిశువుకు PDA (పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్) లిగేషన్ కార్డియాక్ సర్జరీ జరిగింది. ఈ సున్నితమైన ప్రక్రియ…
Swallows Set of Teeth : విశాఖపట్నంలోని ఒక వ్యక్తి పళ్ల సెట్ మింగడంతో ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. 52 సంవత్సరాల వయస్సున్న ఈ వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం తనకు కృత్రిమ పళ్ల సెట్ అమర్చుకున్నాడు. సెట్ అటు ఇటు ఊడిపోతుండడంతో, నిద్రలో ఉన్నప్పుడు అది ఊడిపోయి, తెలియకుండానే ఆయన దాన్ని మింగేసి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. పళ్ల సెట్ కుడి ఊపిరితిత్తి మధ్య భాగంలో ఇరుక్కుంది. అయితే ఎడమ ఊపిరితిత్తి సహజంగా పనిచేస్తుండటంతో శ్వాసకోణంలో ఎలాంటి సమస్యలు…
విశాఖలో వింత ఘటన చోటుచేసుకుంది.. రూ.లక్షా 20 వేలు రూపాయలు పెట్టి కొన్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ తరచూ కంప్లైంట్స్ రావడంతో విసిగిపోయాడు ఓ కస్టమర్. ఇంట్లో ఆడవాళ్లు బైక్ తీసినపుడు నడిరోడ్డు మీద ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదనతో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంకు తాళం వేసి నిరసన తెలిపాడు ఓ కస్టమర్.
ఇటీవల కాలంలో లోన్ యాప్ల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి.. అవసరాల కోసం ఆన్లైన్ యాప్లను ఆశ్రయించిన ఘటనలు కొన్ని అయితే.. వారే పిలిచి మరి లోన్లు ఇచ్చి.. తర్వాత వేధింపులకు గురిచేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.. లోన్ ఇవ్వడం.. ఆ తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో.. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2018లో అప్పటి హోం మంత్రి చిన్నరాజప్ప చేతులు మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్ను ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. విశాఖలో రోడ్డు యాక్సిడెంట్ బాధితుల సహకార కేంద్రం ప్రారంభించామన్నారు.
మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖ మరో కీలక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. గ్లోబల్ ఫోరం సస్టెయినబుల్ ట్రాన్స్ఫార్మేషన్ GFST ఆధ్వర్యంలో "డీప్ టెక్ సమ్మిట్-2024"కు వేదికైంది. ఇక, ఈ కీలక సమ్మిట్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. ఈ సదస్సులోనే వచ్చే ఐదేళ్ల కాలానికి రోడ్ మ్యాప్ రూపొందించే అవకాశం వుంది.