Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Narendra Modi Vizag Tour Live Updates

Narendra Modi Vizag Tour Live Updates : ఏయూ కాలేజ్‌ గ్రౌండ్‌లో ప్రధాని మోడీ బహిరంగ సభ.. భారీగా జనం

Published Date :January 8, 2025 , 4:46 pm
By Gogikar Sai Krishna
  • విశాఖకు చేరుకున్న ప్రధాని మోడీ
  • ప్రత్యేక విమానంలో ఐఎన్‌ఎస్‌ డేగాకు ప్రధాని
  • ప్రధానికి స్వాగత పలికిన గవర్నర్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
Narendra Modi Vizag Tour Live Updates : ఏయూ కాలేజ్‌ గ్రౌండ్‌లో ప్రధాని మోడీ బహిరంగ సభ.. భారీగా జనం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Narendra Modi Vizag Tour Live Updates : ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారు. ఆయనను ఎయిర్‌పోర్టులో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతించారు. సాయంత్రం 4:45 గంటలకు ప్రధాని రోడ్ షో ప్రారంభం కానుంది. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ఈ రోడ్ షో జరగనుంది. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు పాల్గొననున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఒక బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ రైల్వేజోన్‌కు శంకుస్థాపన చేసి, వర్చువల్‌గా అనేక అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కి కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 3 గంటల పాటు ప్రధాని మోడీ విశాఖలో ఉండనున్నారు. అనంతరం ఆయన విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌కు వెళ్లనున్నారు. అయితే.. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం..

The liveblog has ended.
  • 08 Jan 2025 07:07 PM (IST)

    మత్స్యకారుల ఆదాయం పెరిగేలా చూస్తాం: మోడీ

    మత్స్యాకారుల ఆదాయం పెరిగేలా చూస్తాం, ఇప్పటికే వారికి కిసాన్ క్రిడెట్ కార్డులు కూడా అందజేశాం. సముద్రంలో మత్స్యకారుల భద్రత కోసం చర్యలు తీసుకుంటాం. నేడు చేపట్టిన ప్రాజెక్ట్‌లు ఏపీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. ధన్యవాదాలు అంటూ మోడీ ప్రసంగం ముగించారు.

  • 08 Jan 2025 07:02 PM (IST)

    విశాఖలో దక్షిణ రైల్వే జోన్‌‌కు పునాది వేశాం: మోడీ

    విశాఖలో దక్షిణ రైల్వే జోన్‌కు పునాది వేశాం, ప్రత్యేక రైల్వేజోన్‌తో ఏపీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోంది.  రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతోంది. పర్యాటక రంగంతో కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి.

  • 08 Jan 2025 06:58 PM (IST)

    గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ ఏపీకి కేంద్రం కాబోతోంది: మోడీ

    గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ ఏపీకి కేంద్రం కాబోతోంది. దీని ద్వారా ఏపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. మొబైల్ తయారీ రంగంలో ఏపీ గుర్తింపు తెచ్చుకుంది.

  • 08 Jan 2025 06:52 PM (IST)

    చంద్రబాబు లక్ష్యాలకు అండగా ఉంటాం: మోడీ

    చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు మేము అండగా ఉంటాం, అంధ్రప్రదేశ్ అన్ని అవకాశాలు ఉన్న రాష్ట్రం ఏపీ. అభివృద్ధిలో ఏపీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం.

  • 08 Jan 2025 06:48 PM (IST)

    మీ ఆశీర్వాదంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది: మోడీ

    మీ ఆశీర్వాదంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు ప్రసంగాన్ని విన్నాను. రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాను. ఏపీ ప్రజల సేవే మా సంకల్పం

  • 08 Jan 2025 06:45 PM (IST)

    భారత్ మాతాకీ జై నినాదంతో ప్రసంగం ప్రారంభించిన మోడీ

    భారత్ మాతాకీ జై నినాదంతో మోడీ ప్రసంగం ప్రారంభించారు. ఆంధ్రప్రజల అభిమానానికి కృతజ్ఞతలు అంటూ తెలుగులో మాట్లాడిన ప్రధాని. ఆంధ్ర ప్రజల అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ముందుగా సింహాచలం నరసింహ స్వామికి నమస్కరిస్తున్నా

  • 08 Jan 2025 06:37 PM (IST)

    రూ.2లక్షల కోట్ల అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం

    విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో జరుగుతున్న బహిరంగ సభలో ప్రధాని మోడీ.. రూ.2లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను వీడియో ద్వారా ప్రదర్శించారు.

  • 08 Jan 2025 06:35 PM (IST)

    ఇకపై విజయాలే తప్ప.. అపజయాలు ఉండవు: చంద్రబాబు

    ఇకపై విజయాలే తప్ప.. అపజయాలు ఉండవు, గత ఐదేళ్లు ఏపీ వెంటిలేటర్‌పై ఉంది. కష్టాలు ఉన్నాయి. వాటిన్నంటినీ అధిగమిస్తాం, అరకు కాఫీని మోడీనే ప్రమోట్ చేశారు. త్వరలో అమరావతికి మోడీ రావాలని కోరుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వాన్నే ప్రజలు కొనసాగించాలి. మధ్యలో వచ్చేవాళ్లతో విధ్వంసాలే ఉంటాయి.

  • 08 Jan 2025 06:32 PM (IST)

    దేశానికి ఆర్థిక రాజధాని ముంబై అయితే.. ఏపీకి విశాఖ ఆర్థిక రాజధాని: చంద్రబాబు

    భారత్‌కు ఆర్థిక రాజధాని ముంబై అయితే.. ఏపీకి విశాఖ ఆర్థిక రాజధాని.. విశాఖ ప్రజలకు ఇంతకంటే ఏం కావాలి?, మోడీ సహకారంతో ఏపీని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి.

  • 08 Jan 2025 06:29 PM (IST)

    ప్రపంచం మెచ్చిన నాయకుడు మోడీ: చంద్రబాబు

    దేశమే కాదు.. ప్రపంచం మెచ్చిన నాయకుడు మోడీ. హర్యానా, మహారాష్ట్రలో ఎన్డీఏ గెలిచింది. త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా గెలిచేది ఎన్డీఏనే. సూపర్-6 హామీలు అమలు చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటుంది. సంక్షేమం, సుపరిపాలనతో మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

  • 08 Jan 2025 06:12 PM (IST)

    మోడీ అంటే నమ్మకం, విశ్వాసం: చంద్రబాబు

    ఏపీలో ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తోంది. విశాఖలో మోడీ రోడ్ షో అదిరింది. ఎక్కడికి పోయినా.. మోడీపై విశ్వాసం, నమ్మకం ప్రజలకు కలుగుతోంది. రూ.2లక్షల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం కావడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. విశాఖ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే జోన్ కలనెరవేరింది. దేశమే కాదు.. ప్రపంచం మెచ్చిన నాయకుడు మోడీ. హర్యానా, మహారాష్ట్రలో ఎన్డీఏ గెలిచింది. త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా గెలిచేది ఎన్డీఏనే. సూపర్-6 హామీలు అమలు చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటుంది. సంక్షేమం, సుపరిపాలనతో మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

  • 08 Jan 2025 06:04 PM (IST)

    భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా మోడీ మార్చారు: పవన్ కల్యాణ్

    భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా మార్చిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మోడీ ఏకతాటిపై నడిపిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి మోడీ ఎంతగానో సహకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఏపీకి రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి అంటే ఏంటో ఎన్డీఏ ప్రభుత్వం చేసి చూపిస్తోంది.

  • 08 Jan 2025 05:57 PM (IST)

    ప్రధాని ఎలా ఉండాలో మోడీ చేసి చూపించారు: లోకేష్

    ఎంతో మంది ప్రధానులను చూశాం గానీ.. మోడీలా పని చేసిన ప్రధానిని ఇప్పటిదాకా చూడలేదు. అభివృద్ధిలో దేశాన్ని రో‌ల్ మోడల్‌గా ప్రధాని చేశారు. చంద్రబాబు విజన్.. హైదరాబాద్‌లో కనిపిస్తోంది. మోడీ సహకారంతో ఏపీని నెంబర్ వన్‌గా చేస్తాం. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి మోడీ ఆక్సిజన్ ఇచ్చారు.

  • 08 Jan 2025 05:52 PM (IST)

    సభా వేదికపై మోడీ-చంద్రబాబు సంభాషణ

    ఏయూ ఇంజనీరింగ్ సభావేదికపై ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు సంభాషిస్తూ కనిపించారు. ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. వేదికపై గవర్నర్ నజీర్, పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, పురంధేశ్వరి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆశీనులయ్యారు.

  • 08 Jan 2025 05:46 PM (IST)

    ప్రారంభోపన్యాసం చేసిన ఎంపీ సీఎం రమేశ్

    ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ప్రారంభమైంది. సభావేదికపై ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, గవర్నర్ నజీర్ ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ప్రారంభోపన్యాసం చేశారు. మోడీకి స్వాగతం పలుకుతూ.. ప్రధాని చేస్తున్న పలు అభివద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు.

  • 08 Jan 2025 05:43 PM (IST)

    సభా వేదికపై మోడీని సత్కరించిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్

    ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో జరుగుతున్న సభావేదికపై ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, గవర్నర్ నజీర్ ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా శాలువాతో మోడీని చంద్రబాబు సత్కరించారు.

  • 08 Jan 2025 05:35 PM (IST)

    ఏయూ కాలేజీ గ్రౌండ్‌లో బహిరంగ సభ.. సభా వేదికపైకి చేరుకున్న మోడీ

    ప్రధాని మోడీ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకున్నారు. ప్రాంగణంలో కూడా మోడీ కలియతిరిగారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ సభా వేదికపైకి చేరుకున్నారు.

  • 08 Jan 2025 05:26 PM (IST)

    విశాఖలో ముగిసిన రోడ్ షో.. ప్రాంగణానికి చేరుకున్న మోడీ

    విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో ముగిసింది. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌ వరకు రోడ్ షో నిర్వహించారు. ప్రస్తుతం కాలేజీ ప్రాంగణానికి మోడీ చేరుకున్నారు. ఓపెన్ టాప్ వాహనం పైనుంచి ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పురందేశ్వరి ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. దారి పొడవునా ప్రజలు పూల వర్షం కురిపించారు.

  • 08 Jan 2025 05:24 PM (IST)

    విశాఖలో కొనసాగుతున్న మోడీ రోడ్ షో

    విశాఖలో అరగంట నుంచి సాగుతున్న మోడీ రోడ్ షో. దారి పొడువునా పూల వర్షం కురిపించిన ప్రజలు.. మోడీ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరికాసేపట్లో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు మోడీ చేరుకోనున్నారు.

  • 08 Jan 2025 05:18 PM (IST)

    పూలవర్షంతో ప్రధాని మోడీకి స్థానికులు, అభిమానుల ఘనస్వాగతం

    మోడీ రోడ్‌ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్. పూలవర్షంతో ప్రధాని మోడీకి స్థానికులు, అభిమానుల ఘనస్వాగతం. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న మోడీ రోడ్‌ షో.

  • 08 Jan 2025 04:55 PM (IST)

    విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో ప్రారంభం

    విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో ప్రారంభం. రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు రోడ్ షో. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ

  • 08 Jan 2025 04:52 PM (IST)

    రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

    రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని మోడీ. ప్రధాని మోడీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత.

  • 08 Jan 2025 04:48 PM (IST)

    కాసేపట్లో విశాఖలో ప్రధాని మోడీ రోడ్‌ షో

    కాసేపట్లో విశాఖలో ప్రధాని మోడీ రోడ్‌ షో, భారీ బహిరంగ సభ. సిరిపురం జంక్షన్‌ నుంచి ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌ వరకు రోడ్‌ షో. ఏయూ కాలేజీ గ్రౌండ్‌లోనే బహిరంగ సభ.

  • 08 Jan 2025 04:32 PM (IST)

    విశాఖకు చేరుకున్న ప్రధాని మోడీ

    విశాఖకు చేరుకున్న ప్రధాని మోడీ. ప్రత్యేక విమానంలో ఐఎన్‌ఎస్‌ డేగాకు ప్రధాని. ప్రధాని మోడీకి స్వాగతం పలికిన గవర్నర్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.

  • 08 Jan 2025 04:20 PM (IST)

    కాసేపట్లో విశాఖకు ప్రధాని మోడీ.

    కాసేపట్లో విశాఖకు ప్రధాని మోడీ. ప్రత్యేక విమానంలో ఐఎన్‌ఎస్‌ డేగాకు ప్రధాని. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఐఎన్‌ఎస్‌ డేగాకు బయల్దేరిన సీఎం చంద్రబాబు. ప్రధానికి స్వాగత పలకనున్న గవర్నర్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • babu
  • Development projects
  • Green Hydrogen Hub
  • Industrial Hub

ట్రెండింగ్‌

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions