Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో మరోసారి కార్మికులు ధర్నాకు దిగారు.. దీంతో, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట కార్మికులు భారీ స్థాయిలో మహా ధర్నా చేపట్టారు. కార్మికుల వేతనాలను ఉత్పత్తి ఆధారంగా చెల్లించాలన్న సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. Read Also: Saudi Bus…
YS Jagan: జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది. రూట్ మార్చి..18 కండీషన్లతో పోలీసులు అనుమతి ఇచ్చారు. పోలీసులు ప్రతిపాదించిన మార్గంలోనే జగన్ పర్యటన నిర్వహించేందుకు వైసీపీ నాయకత్వం అంగీకరించింది. ఈ అంశంపై మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. "జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్మోహన్ రెడ్డి కలవకుండా చూసేందుకు పోలీసులు రూట్ మార్చారు.
మరోసారి ఆందోళన బాట పట్టేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు సిద్ధమయ్యారు. జీతాల కోసం సమ్మెకు దిగనున్నారు. ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో కార్మికులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. ఉక్కు ఉన్నతాధికారులను పిలిచి జేసీఎల్ (JCL) వివరణ కోరింది. కాగా.. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు.
విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్కు కేంద్ర ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాక తొలి సందర్శనకు వెళ్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. రేపు తొలి సారి ప్లాంట్ సందర్శన కోసం కేంద్రమంత్రి కుమారస్వామితో కలిసి వెళ్తున్నట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం.. కార్మిక సోదర సలహాలు తీసుకునేందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.
ఎందరో త్యాగధనుల ఫలితమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
Mithun Reddy : రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ… అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక డిమాండ్లు ప్రస్తావించామని, పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రాష్ట్ర మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారన్నారు. పోలవరం ఎత్తు ఎంత అన్నదానిపై రకరకాల ప్రశ్నలు వస్తున్నాయని, పోలవరం అంశంపై పార్లమెంట్ లో చర్చించాలన్నారు మిథున్ రెడ్డి.…
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటైపోయి స్టీల్ ప్లాంట్ లో 4వేల మంది కార్మికులను తొలగించటానికి సిద్ధం అవుతున్నాయని ఎమ్మెల్సీ బోత్స సత్యనారాయణ అన్నారు. ఏ ఒక్కరినీ తొలగించటానికి అడుగులు వెయ్యొద్దని డిమాండ్ చేశారు.