Pawan Kalyan: ఎందరో త్యాగధనుల ఫలితమే వైజాగ్ స్టీల్ ప్లాంట్
- ఎందరో త్యాగధనుల ఫలితమే వైజాగ్ స్టీల్ ప్లాంట్
- కేంద్రం ప్యాకేజీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎందరో త్యాగధనుల ఫలితమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకు పవన్కల్యాణ్.. ప్రధాని మోడీ.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం రూ.11, 440 కోట్లు కేంద్రం కేటాయించడంతో వేల కుటుంబాల ఆశలు చిగురించేలా చేసిందన్నారు. ప్రధాని మోడీతో సహా కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఇది ఆర్థిక స్వావలంబన మాత్రమే కాదని.. 1966 నాటి త్యాగాలకు ఇచ్చిన గుర్తింపు అని పేర్కొ్న్నారు. 1966లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలను అర్పించిన అమృతరావుతో సహా లెక్కలేనన్ని మంది ఇతరుల త్యాగం మన హృదయాలలో శాశ్వతంగా మండుతోందని తెలిపారు. వారి రక్తం మరియు కన్నీళ్లు నేడు ఒక ఫ్యాక్టరీగా మాత్రమే కాకుండా.. తెలుగు ప్రజల గర్వం మరియు గుర్తింపుగా నిలిచిన దానికి పునాది వేశాయని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ని రక్షించిన ఆటో డ్రైవర్ “భజన్ సింగ్ రాణా”.. ఘటన గురించి ఏమన్నారంటే..
Also Read
విశాఖ ఉక్కుపై కేంద్రం గుడ్న్యూ్స్ చెప్పింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఫ్యాక్టరీకి కేంద్రం కొత్త జీవం పోసింది. పరిశ్రమ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ.11, 440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Bharat Mobility Expo: కియా కొత్త ఎలక్ట్రిక్ కారు విడుదల..18 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!.. 494 కి.మీ రేంజ్..
"The sacrifice of Amruta Rao garu and countless others who gave their lives for the Visakhapatnam Steel Plant in 1966 burns eternal in our hearts. Their blood and tears laid the foundation for what stands today not just as a factory, but as the pride and identity of Telugu… https://t.co/AsVFQ0qRxD
— Pawan Kalyan (@PawanKalyan) January 17, 2025
తాజావార్తలు
-
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
-
Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
-
RCB vs KKR: మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా.. కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
-
Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!