Virat Kohli: విరాట్ కోహ్లీ ప్రకటనలను నిలిపివేసిన వివో.. కారణం ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. వివో కంపెనీ రూ.62,476 కోట్ల మేర ఇంకమ్ ట్యాక్స్ చెల్లించకుండా ఆ మొత్తం డబ్బులను చైనాకు తరలించిందని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇండియాలోని 23 రాష్ట్రాల్లో 48 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ నటించిన ప్రకటనలు టెలీకాస్ట్కు సిద్ధంగా ఉండగా వాటిని తాజాగా వివో యాజమాన్యం నిలిపివేసింది. అయితే ఇది తాత్కాలిక నిషేధమేనని తెలియజేసింది. ఇప్పుడున్న సమస్యలు పరిష్కారం అయిన తర్వాత సదరు ప్రకటనలను టీవీలు, సోషల్ మీడియా ప్లా్ట్ఫారాలలో ప్రసారం చేస్తామని వివో పేర్కొంది.
Read Also: Tata Motors: పెరుగనున్న టాటా కార్ల ధరలు
Also Read
- Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!
- PF Withdrawal: ATM నుండి PF డబ్బులు...! తాజా అప్డేట్ ఇదే..
- Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్లు ఇవే!
- SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
గత ఏడాది ఏప్రిల్లో వివోతో విరాట్ కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు ఆ కంపెనీ ప్రకటనలలో విరాట్ కోహ్లీ నటిస్తున్నాడు. అయితే ఇండియాలో వివో స్మార్ట్ ఫోన్ విక్రయాలు 1,25,185 కోట్లు కాగా అందులో 62,476 కోట్లను ఆ కంపెనీ చైనాకు పంపించినట్లు ఈడీ అధికారులు నిర్ధారించారు. కాగా తాజా పరిస్థితుల దృష్ట్యా తాము తీసుకున్న నిర్ణయం విరాట్ కోహ్లీకి కూడా ఉపయోగపడుతుందని వివో యాజమాన్యం అభిప్రాయపడింది. ఒకవేళ సదరు ప్రకటనలు టెలీకాస్ట్ అయితే విరాట్ కోహ్లీపైనా విమర్శలు వచ్చే అవకాశం ఉందని. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.
తాజావార్తలు
-
Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం “అమ్మ”
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్