కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు రాజ్ గోపాల్ రెడ్డి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనడానికి గుంటూరు వచ్చాను. ఈరోజు విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకున్నాను.. నేను ఇక్కడికి బయలుదేరినప్పటి నుండి రాజకీయంగా నా పై దుష్ప్రచారం చేస్తున్నారు.. నేను నిన్ననే మీడియా ముందు క్లారిటీ ఇచ్చాను.. కొంతమంది కావాలని నా ప్రతిష్టను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారు.. వాటిని నమ్మకండి.. నేను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవడం లేదు అన్నారు..
Off The Record: 2029 అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఇప్పటి నుంచే గ్రౌండ్ క్లియర్ చేసుకుంటున్నారా అంటే…అవును, వాతావరణం అలాగే కనిపిస్తోందన్నది పరిశీలకుల సమాధానం. తన విషయంలో పార్టీ పెద్దల ఆలోచన ఎలాఉందో… చూచాయగా తెలుసుకున్న అవినాష్….అందుకు భిన్నంగా ఇప్పట్నుంచే పావులు కదిపి అప్పటికి లైన్ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారట. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అవినాష్. ఆ తర్వాత…
విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసుల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వెళుతున్న వాహన చోదకులకు జరిమానాలు విధించడంతో సరిపెట్టకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేయటం ఇప్పుడు వివాదానికి కారణమైంది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అవగాహన కల్పించడంలో తప్పేం లేనప్పటికీ అది హద్దులు దాటి అవతలి వాళ్ళని అవమానించే వరకు వెళ్లడంతో పోలీసులు అతి చేస్తున్నారని వరకు వ్యవహారం వెళ్లింది..
విజయవాడ రాజరాజేశ్వరి పేటలో డయేరియా వ్యాప్తి అరికట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్ల సదస్సులో అధికారుల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
విజయవాడలో కోర్టు వద్ద మరోసారి హల్చల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఏపీ మద్యం స్కాం కేసులో అరెస్ట్ అయిన ఆయన.. అప్పటి నుంచి కోర్టుకు తీసుకొచ్చిన ప్రతీసారి.. ఏదో హల్ చల్ చేస్తూ వస్తున్నారు.. అయితే, తాను ఏ తప్పు చేయకపోయినా కేసు నమోదు చేసి జైల్లో పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. మీడియాలో కూడా ఇష్ట రీతిన అసత్య వార్తలు రాస్తున్నారని.. వారిపై న్యాయపోరాటం…
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోపే ప్రభుత్వానికి నివేదికని ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకొనుంది. అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రెండు మూడు జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశం ఉందని సమాచారం. వైస్సార్సీపీ హాయాంలో పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అయితే, ఇందులోని గందరగోళం ఉందని మార్పులు అవసరమని…
Vijayawada: దసరా పండగను అనుసరించి జరగబోయే నవరాత్రులకు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి దేవీ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు ఈ శరన్నవరాత్రులు కొనసాగునున్నాయి. ప్రతి ఏడాది పది అలంకారాలు జరుగుతూ వస్తున్నా.. ఈసారి మాత్రం అమ్మవారు 11 అలంకారాలలో దర్శనం ఇవ్వనున్నట్లు సమాచారం. బాలత్రిపుర సుందరి నుంచి రాజేశ్వరి దేవి వరకు 11 రోజులు 11 అలంకారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.…
విజయవాడలో డయేరీయా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. తెల్లారేసరికి 30 డయేరియా కేసులు ఒకే ఏరియాలో రావడంతో, అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు... ఇప్పటి వరకూ ఏడు పదుల వరకూ కేసులు నమోదు కావడంతో కారణాలను తెలుసుకునే పనిలో పడింది ప్రభుత్వం.. అధికారులు సైతం క్షేత్రస్ధాయిలో ప్రతీ అంశాన్నీ టెస్టులు చేస్తున్నారు... మొత్తం అధికార యంత్రాంగం అంతా విజయవాడ కొత్త రాజరాజేశ్వరి పేటలోనే ఉంటోంది..