Nara Lokesh: చరిత్ర రాయాలన్నా.. సృష్టించాలన్నా విజయవాడతోనే!
- విజయవాడ పేరులోనే విజయం ఉంది
- వెంకయ్య నాయుడు ఏజ్ ఒక నంబర్ మాత్రమే
- ఫాస్ట్ లైఫ్, ఫాస్ట్ ఫుడ్ మంచిది కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘విజయవాడ’ పేరులోనే విజయం ఉందని.. చరిత్ర రాయాలన్నా, సృష్టించాలన్నా విజయవాడతోనే సాధ్యం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు భాష అభివృద్ధికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. జీవోలన్ని తెలుగులో వస్తున్నాయంటే అది వెంకయ్య నాయుడుతోనే సాధ్యం అని పేర్కొన్నారు. ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే అన్నారు. వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబుతో తాను పోటీ పడలేకపోతున్నానని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో శోభాయమానంగా విజయవాడ ఉత్సవ్ ప్రారంభమైంది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 3 వేల మంది కళాకారులతో అతిపెద్ద కార్నివాల్ నిర్వహిస్తున్నారు. డ్రోన్ షో నిర్వహిస్తున్నారు. పారా మోటరింగ్, హెలిరైడ్ నిర్వహిస్తున్నారు. మైసూర్ ఉత్సవాలకు ధీటుగా విజయవాడ ఉత్సవాలు జరగాలి. లండన్లో వండర్ కార్నివాల్ బాగా చేస్తారు. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎంపీ కేశినేనిచిన్ని కలిసి విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని చెప్పినప్పుడు ఆచర్యపడ్డాను. మెగా డీఎస్సీ సభ నిర్వహిస్తాం’ అని మంత్రి నారా లోకేష్ చెప్పారు. దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకూ ‘విజయవాడ ఉత్సవ్’ జరగనుంది. 286 ఈవెంట్స్తో వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివాల్ను నిర్వహిస్తున్నారు.
Also Read
‘విజయవాడ ఉత్సవ్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. విజయవాడ ఉత్సవ్తో విజయవాడకు నూతన శోభ. విజయవాడ ఉత్సవ్ ద్వారా విజయవాడ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది. మంచి చేసే వారిని ఎప్పుడు గౌరవించాలి. రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్మెంట్ అవసరం. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుంది. కుటుంబ వ్యవస్ధ ప్రస్తుతం ఛిన్నాభిన్నం అవుతోంది. వంట విడిపోతే జంట విడిపోద్ది.. వంటను కాపాడుకోండి. భాష పోతే శ్వాస పోయినట్టే.. అందరూ మాతృ భాషను కాపాడుకోవాలి. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలని చంద్రబాబును కోరా.. ఇవాళ తెలుగులో ఇచ్చారు సంతోషం. ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వచ్చి విజయవాడ ఉత్సవ్ నిర్వహించడం సంతోషం. ఫాస్ట్ లైఫ్, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు.. అది మంచిది కాదు. విజయవాడ ఉత్సవ్ సక్సెస్ కావాలంటే అందరూ కష్టపడి పనిచేయాలి’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!