Actress Hema: చేయని తప్పుకి నన్ను బలి చేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు టాలీవుడ్ సీనియర్ నటి హేమ.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆమె.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మ ఆలయంలో కన్నీరు పెట్టుకున్నారు.. ఈ రోజు దుర్గమ్మ దర్శనానికి వచ్చాను, ప్రతీ ఏడాది వస్తాను అని తెలిపిన ఆమె.. అయితే, ఈ సంవత్సరం ఓ ప్రత్యేకత ఉంది.. గత ఏడాది మీరందరూ నాపై వేసిన నీలపనిందలు దుర్గమ్మ తుడిచిపెట్టిందన్నారు.. ఇక, నేను చేయని తప్పుకి మీరందరూ నన్ను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు నన్ను గుడికి వచ్చేటట్టు ఆ దుర్గమ్మ చేసిందన్నారు.. కానీ, దాని నుండి బయటపడడం నావల్ల కాలేదు. ప్రతిక్షణం దుర్గమ్మ తల్లి నేనున్నాను నువ్వు ముందుకెళ్లు అని నన్ను బతికిచ్చిందన్నారు.. ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులు అండదండలు నేను మర్చిపోలేను.. దయచేసి మీరు ఏదైనా వార్త వేసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకుని వేయండి అంటూ మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.. ఈరోజు నేను గుడిలో ఉండి చెప్తున్నాను.. నేను ఈ తప్పు చేయలేదు అని మరోసారి స్పష్టం చేశారు సినీ నటి హేమ..
Read Also: IND vs AUS: ఆస్ట్రేలియా వన్డే సిరీస్కు స్టార్ ప్లేయర్ అవుట్.. రోహిత్, విరాట్..!
కాగా, కొన్ని నెలల క్రితం రేవ్ పార్టీలో నటి హేమ కూడా పట్టుబడినట్లు బెంగళూరు పోలీసులు ప్రకటించడం అప్పట్లో టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు, హేమ డ్రగ్స్ సేవించిందని, టెస్ట్ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ గా వచ్చిందంటూ పేర్కొన్న పోలీసులు.. ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత విచారణకు పిలిచి హేమను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు.. ఆ తర్వాత హేమపై నమోదైన కేసులో కోర్టు స్టే విధించడంతో ఆమెకు ఊరట దక్కినట్టు అయిన విషయం విదితమే..