కోలీవుడ్ సూపర్ స్టార్ తలపతి విజయ్ ప్రస్తుతం తన తదుపరి డార్క్ థ్రిల్లర్ చిత్రం “బీస్ట్” షూటింగ్లో బిజీగా ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తరువాత విజయ్ 66వ చిత్రం డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుంది. విజయ్ ఫస్ట్ డైరెక్ట్ మూవీగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఇది 50వ చిత్రం…
టాలీవుడ్ యంగ్ హీరోల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. అయితే మిడిల్ క్లాస్ అబ్బాయి తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు నాని. ‘జెర్సీ’తో నటుడుగా విమర్శకుల ప్రశంసలు పొందినా… కమర్షియల్ గా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కొట్టలేక పోయాడు. ఆ తర్వాత వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’, ‘వి’, ‘టక్ జగదీశ్’ వరుసగా నిరాశ పరిచాయి. మధ్యలో నిర్మాతగా ‘హిట్’తో విజయం సాధించినా నటుడుగా మాత్రం సక్సెస్…
ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాప్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం ఆయన మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుమలను సందర్శించారు. అక్కడ శ్రీవారిని దర్శించి, పూజా తదితర కార్యక్రమాలు కావించారు. శ్రీవారి సర్వదర్శనం అనంతరం తీర్థప్రసాదాలు, పూజారుల ఆశీస్సులు అందుకున్నారు. దిల్ రాజుతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరుమలను సందర్శించారు. Read Also…
ప్రముఖ ఫిల్మ్ మేకర్ వంశీ పైడిపల్లి ఇటీవలే మీడియా ఇంటరాక్షన్లో తమిళ స్టార్ హీరో విజయ్తో తన తదుపరి ప్రాజెక్ట్ ఉంటుందని వెల్లడించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని తెలిసిన అధికారిక ప్రకటన కోసం విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజయ్ నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం, మొదటి స్ట్రెయిట్ తెలుగు చిత్రం…
కోలీవుడ్ సూపర్ స్టార్, తలపతి విజయ్ పలు వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తన రోల్స్ రాయిస్ కారు పన్ను విషయంలో ఆయన చర్చనీయాంశం అయ్యారు. తాజాగా తల్లిదండ్రులతో పాటు ఇంకొంతమందిపై విజయ్ కేసు పెట్టడం తమిళనాట సంచలనంగా మారింది. కోలీవుడ్ లో విజయ్ కు అశేషమైన ప్రజాదరణ ఉన్న విషయం తెలిసిందే. అయితే తన అభిమానులను, తన పేరును తండ్రి రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకోవద్దు అంటూ ఇంతకుముందు విజయ్ హెచ్చరించారు. తాజాగా విజయ్…
తలపతి విజయ్ రోల్స్ రాయిస్ ట్యాక్స్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. 2012 లో విజయ్ ఖరీదైన లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్ను లండన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. కస్టమ్ డ్యూటీగా దిగుమతి చేసుకోవడానికి అతను పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాడు. అన్ని పన్నులు, ఛార్జీలను చెల్లించాడు. కానీ నిబంధనల ప్రకారం ఉన్న ఎంట్రీ ట్యాక్స్ నుండి మాత్రం మినహాయింపుని కోరాడు. దీనిపై అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో కోర్టులో కేసు వేశాడు. ప్రవేశ పన్ను మినహాయింపుకు…
తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “బీస్ట్”. ఈ మూవీలో మరో కోలీవుడ్ హీరో ధనుష్ కూడా భాగం కాబోతున్నాడట. ఇదే విషయంపై ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ చర్చ నడుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో భాగం కావడం అనే వార్త అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా ధనుష్ గురించి కూడా. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్…
యోగి బాబు… కోలీవుడ్ లో ఈయన కేవలం కమెడియన్ మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. ఆ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకున్నాడు కూడా! యోగి బాబు తాజాగా ‘మండేలా’ అనే సినిమాతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో ఆయనదే ప్రధాన పాత్ర. బాక్సాఫీస్ వద్ద తన స్వంత ఇమేజ్ తో సినిమా సక్సెస్ చేయగలనని ఆయన మరోసారి ఋజువు చేశాడు. అయితే, సక్సెస్ మాత్రమే కాదు యోగి బాబు నటనకి కూడా ‘మండేలా’ సినిమాకిగానూ బోలెడు పొగడ్తలు…
విజయ్ హీరోగా రూపొందుతున్న తాజా మూవీ “బీస్ట్”. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. సెల్వరాఘవన్, గణేష్, అపర్ణ దాస్, యోగి బాబు, షైన్ టామ్ చాకో, లిల్లీపుట్ ఫారుకీ, అంకుర్ అజిత్ వికల్ సహాయక పాత్రలు పోషించారు. తాజా సమాచారం ప్రకారం నటుడు శివకార్తికేయన్ “బీస్ట్” కోసం లిరిక్ రైటర్ గా మారుతున్నారు. ఈ సినిమాలోని…
తలపతి విజయ్ లగ్జరీ కారు కాంట్రవర్సీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు విజయ్ కు ఊరటనిచ్చింది. 2011-12 సంవత్సరంలో విజయ్ ఇంగ్లాండ్ నుంచి ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును దిగుమతి చేసుకున్నారు. అప్పటికే ఆ కారు గురించి కస్టమ్స్ అధికారులకు పన్ను చెల్లించారు. అయితే అదే సమయంలో ఎంట్రీ ట్యాక్స్ కట్టే విషయంలో మినహాయింపు కావాలని కోరుతూ చెన్నై అసిస్టెంట్ కమిషనర్ కు లేఖ రాశారు. కానీ…