ఉత్తరప్రదేశ్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీ విషాదాన్ని మిగిల్చాయి. శుక్రవారం రాజధాని లక్నో, ఉన్నావ్, ఫతేపూర్, సీతాపూర్లలో గోడలు, ఇల్లు కూలిన ఘటనల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లోని లక్నోలో గోడ కూలిన ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అయితే ఈ గోడ కూలిన సమాచారం అందించింది బాధితుడేనని తెలిసింది.
ఇద్దరు యువతులు చెట్టుకు వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. దళిత వర్గానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి ఆ తర్వాత వారిపై లైంగికంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కౌశాంబికి చెందిన సంపత్(32) అనే భక్తుడు మా శీత్లా ఆలయంలో తన నాలుకను కోసుకుని స్వామివారికి సమర్పించినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్లోని రిషికేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. రిషికేశ్-బద్రీనాథ్ రహదారిపై బ్రహ్మపురి సమీపంలో శుక్రవారం ఉదయం ఓ కారు లోతైన లోయలో పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ మెయిన్పురి సమీపంలోని కొత్వాలి ప్రాంతంలో జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో అపశృతి జరిగింది. ఓ గణేశ్ మండపంలో నిర్వహించిన భజనలో హనుమంతుడు వేషం వేసిన కళాకారుడు డ్యాన్స్ చేస్తూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ నుంచి గోవాకు వలస కార్మికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరప్రదేశ్లో ఘాజీపూర్ జిల్లాలోని రేవతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అథోటా గ్రామంలో బుధవారం 17 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో ఐదుగురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు.