Yogi Adityanath: హోలీ పండగ వేళ ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం మాట్లాడుతూ.. సనాతన ధర్మం గొప్పతనాన్ని వివరించారు. ప్రపంచంలో మరే దేశానికి లేదా మరే మతానికి ‘‘సనాతన ధర్మం’’ వంటి గొప్ప పండగలు, వేడుకల సంప్రదాయం లేదని ఆయన అన్నారు. గోవధదారులకు మద్దతు ఇచ్చిన వారు, అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారు దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
దేశమంతటా అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. జనమంతా రంగుళకేళిలో తేలియాడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు వాటర్ గన్లను తీసుకుని రంగులు జల్లుకుంటూ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. కాగా.. ఉత్తర్ప్రదేశ్లోని సంభాల్లో మాత్రం 46 ఏళ్ల తర్వాత హోలీ ఘనంగా నిర్వహించారు. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా నగరంలోని కార్తికేయ ఆలయంలో హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు, హిందువులు ఒకరినొకరు గులాల్ పూసుకుంటూ.. సంబరాలు జరుపుకున్నారు.
దేశవ్యాప్తంగా నేడు హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లో జనాల మధ్య పండుగను ఘనంగా జరుపుకున్నారు.
Sambhal holi celebration: హోలీ వేడుకల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణం చర్చనీయాంశమైంది. ఇటీవల సంభాల్ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ‘‘హోలీ ఏడాదికి ఒకసారి వస్తుంది. శుక్రవారం నమాజ్ 52 సార్లు చేసుకోవచ్చు. ఎవరికైనా హోలీతో ఇబ్బంది ఉంటే ఇంట్లోనే ఉండాలి’’ అని సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ చౌదరి అన్నారు. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సంభాల్లోని వివాదాస్పద జామా మసీదుతో పాటు మరో 10 మసీదులను టార్పలిన్లతో…
UP CM Yogi: ప్రతిపక్ష పార్టీలు, ఆ పార్టీల నేతలు మొఘల్ పాలకుడు ఔరంగజేబును కీర్తించడంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ఔరంగజేబును ప్రశంసించే వారి మానసిక స్థితి గురించి ప్రశ్నించారు. లక్నోలో జరిగిన మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ.. మానసికంగా సరిగా లేని వ్యక్తి మాత్రమే ఔరంగజేబును ఆదర్శవంతమైన వ్యక్తిగా కొలుస్తారని అన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ వారపత్రిక ఆర్గనైజర్ నిర్వహించిన కార్యక్రమంలో యోగి ఈ కామెంట్స్ చేశారు.
Yogi Adityanath: హిమాలయ దేశం నేపాల్లో రాజరిక పాలన కోసం ప్రజలు గళమెత్తుతున్నారు. మాజీ రాజు జ్ఞానేంద్ర కోసం ప్రజలు ర్యాలీలు, నిరసనలు నిర్వహిస్తున్నారు. నేపాల్లో ప్రజాస్వామ్యం వద్దని, మళ్లీ రాజరికం కావాలని కోరడం సంచలనంగా మారింది. అయితే, మార్చి 10న రాజు జ్ఞానేంద్రకు అనుకూలంగా త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జ్ఞానేంద్రతో పాటు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటో ఉండటం చర్చనీయాంశంగా మారింది.
హోలీకి ముందు ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొత్త గోధుమ సేకరణ విధానాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమోదించారు. దీంతో పాటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గోధుమ మద్దతు ధరను గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.150 పెంచారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గోధుమ మద్దతు ధర (MSP)ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
Hizbul Mujahideen: రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న కరడుకట్టిన హిజ్బుల్ ముజాహిదీన్తో సంబంధం ఉన్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ ఉగ్రవాది నిరోధక దళం(ఏటీఎస్) అరెస్ట్ చేసింది. ఉల్ఫత్ హుస్సేన్ అలియాస్ మొహమ్మద్ సైఫుల్ ఇస్లాం అలియాస్ అఫ్జల్ హుస్సేన్ మాలిక్ని మొరాదాబాద్లో అరెస్ట్ చేశారు. యూపీలో పెద్ద ఉగ్రవాద దాడికి కుట్ర పన్నుతున్నట్లు తేలింది.
Shocking News: తన మాట వినడం లేదని 5 ఏళ్ల కూతురిని తండ్రి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ సీతాపూర్లో జరిగింది. పొరుగింటికి పదే పదే వెళ్తుందనే కోపంతో బాలిక గొంతు నులిమి, నాలుగు ముక్కలుగా నరికి హత్య చేశాడు. నిందితుడు మోహిత్ తన పొరుగింటి వారైన రాము కుటుంబంతో గొడవపడుతున్నాడు. తనతో విరోధం ఉన్న పొరుగింటికి తన కుమార్తె వెళ్తుందనే ఒకే ఒక్క కారణంతో హత్యకు పాల్పడ్డాడు.
Yogi Adityanath: ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాజ్ వాదీ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. భారతదేశ మతపరమైన భావాలతో "ఆటలు" పడుతోందన్నారు.