Pakistan: పాక్ అణ్వాయుధాలు అమెరికా చేతిలో ఉన్నాయా..? మాజీ-సీఐఏ అధికారి సంచలనం..
- ముషారఫ్ సమయంలో పాక్ అణ్వాయుధాలు అమెరికా చేతిలో..
- పాక్ అణు శాస్త్రవేత్త హత్యను సౌదీ అరేబియా అడ్డుకుంది..
- సంచలన విషయాలు వెల్లడించిన మాజీ సీఐఏ అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల చీఫ్గా, సీఐఏ అధికారిగా 15 ఏళ్ల పనిచేసిన జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మిలియన్ల కొద్ది అమెరికా సాయం తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. ఆయన హయాంలోనే పాకిస్తాన్ అణ్వాయుధాలను అమెరికా నియంత్రించిందని పేర్కొన్నారు. ముషారఫ్ అణు నియంత్రణను అమెరికాకు అమ్మేశాడని ఆయన అన్నారు.
Read Also: India-Pakistan: యుద్ధం ఏదైనా భారత్ చేతిలో పాక్ ఓటమి తప్పదు: మాజీ అమెరికా అధికారి.
Also Read
- Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
- Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
- PM-Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఈ వారమే ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
అమెరికా విదేశాంగ విధానంపై కూడా కిరియాకౌ విమర్శలు గుప్పించింది. అమెరికా నియంతలతో సౌకర్యవంతంగా పనిచేస్తుందని, ప్రజస్వామ్య ఆదర్శాల కంటే స్వార్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. అమెరికా ఆర్థిక సాయంతో దీనిని కొనుగోలు చేసిందని చెప్పారు. ముషారఫ్ డబుల్ గేమ్ ఆడుతూ.. అమెరికాకు మద్దతు ఇస్తూనే, పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల్ని భారత్ పైకి ఎగదోశారని అన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. పాకిస్తాన్ సైన్యం అల్ఖైదాను పట్టించుకోలేదని, భారత్ గురించి పట్టించుకుందని చెప్పారు.
పాకిస్తాన్ అణు బాంబు రూపశిల్పి ఏక్యూ ఖాన్ను అమెరికా తలుచుకుంటే చంపేసేదని అన్నారు. ఇజ్రాయిల్ తరహాలో అమెరికా కూడా పాక్ అణు శాస్త్రవేత్తను హతమార్చేది కానీ, సౌదీ అరేబియా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంతో అమెరికా అతడిని వదిలేసిందని చెప్పారు. ఏక్యూ ఖాన్ అంటే తమకు ఇష్టమని, అతడితో కలిసి పనిచేస్తున్నామని సౌదీ చెప్పినట్లు వెల్లడించారు. అమెరికా-సౌదీ సంబంధం గురించి మాట్లాడుతూ.. సౌదీ నుంచి అమెరికా చమురు కొనుగోలు చేస్తుంది, వారు అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తారని చెప్పారు. సౌదీ అరేబయా, చైనా, భారత్ తమ వ్యూహాత్మక అవసరాలను పునర్నిర్వచించుకున్నందున ప్రపంచ శక్తి గతిశీలత మారుతోందని కిరియాకౌఅన్నారు.
తాజావార్తలు
-
Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
-
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
-
Moong Dal Dosa Recipe: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ హై-ప్రోటీన్ దోసె మీకోసమే
-
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్’కి ఏమైంది?
-
Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?