Pakistan: పాక్ అణ్వాయుధాలు అమెరికా చేతిలో ఉన్నాయా..? మాజీ-సీఐఏ అధికారి సంచలనం..
- ముషారఫ్ సమయంలో పాక్ అణ్వాయుధాలు అమెరికా చేతిలో..
- పాక్ అణు శాస్త్రవేత్త హత్యను సౌదీ అరేబియా అడ్డుకుంది..
- సంచలన విషయాలు వెల్లడించిన మాజీ సీఐఏ అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల చీఫ్గా, సీఐఏ అధికారిగా 15 ఏళ్ల పనిచేసిన జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మిలియన్ల కొద్ది అమెరికా సాయం తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. ఆయన హయాంలోనే పాకిస్తాన్ అణ్వాయుధాలను అమెరికా నియంత్రించిందని పేర్కొన్నారు. ముషారఫ్ అణు నియంత్రణను అమెరికాకు అమ్మేశాడని ఆయన అన్నారు.
Read Also: India-Pakistan: యుద్ధం ఏదైనా భారత్ చేతిలో పాక్ ఓటమి తప్పదు: మాజీ అమెరికా అధికారి.
Also Read
- Manipur: మణిపూర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి..
- PoK Protest: ప్లీజ్ మాకు సాయం చేయండి.. భారత్ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్..
- Gold Ring: తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన బంగారపు ఉంగరం.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Taj Mahal: తాజ్మహల్పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ.. కేంద్రానికి నోటీసులు
అమెరికా విదేశాంగ విధానంపై కూడా కిరియాకౌ విమర్శలు గుప్పించింది. అమెరికా నియంతలతో సౌకర్యవంతంగా పనిచేస్తుందని, ప్రజస్వామ్య ఆదర్శాల కంటే స్వార్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. అమెరికా ఆర్థిక సాయంతో దీనిని కొనుగోలు చేసిందని చెప్పారు. ముషారఫ్ డబుల్ గేమ్ ఆడుతూ.. అమెరికాకు మద్దతు ఇస్తూనే, పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల్ని భారత్ పైకి ఎగదోశారని అన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. పాకిస్తాన్ సైన్యం అల్ఖైదాను పట్టించుకోలేదని, భారత్ గురించి పట్టించుకుందని చెప్పారు.
పాకిస్తాన్ అణు బాంబు రూపశిల్పి ఏక్యూ ఖాన్ను అమెరికా తలుచుకుంటే చంపేసేదని అన్నారు. ఇజ్రాయిల్ తరహాలో అమెరికా కూడా పాక్ అణు శాస్త్రవేత్తను హతమార్చేది కానీ, సౌదీ అరేబియా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంతో అమెరికా అతడిని వదిలేసిందని చెప్పారు. ఏక్యూ ఖాన్ అంటే తమకు ఇష్టమని, అతడితో కలిసి పనిచేస్తున్నామని సౌదీ చెప్పినట్లు వెల్లడించారు. అమెరికా-సౌదీ సంబంధం గురించి మాట్లాడుతూ.. సౌదీ నుంచి అమెరికా చమురు కొనుగోలు చేస్తుంది, వారు అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తారని చెప్పారు. సౌదీ అరేబయా, చైనా, భారత్ తమ వ్యూహాత్మక అవసరాలను పునర్నిర్వచించుకున్నందున ప్రపంచ శక్తి గతిశీలత మారుతోందని కిరియాకౌఅన్నారు.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!