దాదాపు రెండేళ్ల తర్వాత హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సోమవారం మూడు విడతలుగా బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది.
గత నెలలో చైనా భారీ కవాతు నిర్వహించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయానికి 80 ఏళ్ల పూర్తయిన సందర్భంగా బీజింగ్లో భారీ కవాతు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా 25 దేశాధినేతలంతా హాజరయ్యారు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడోకు అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి అభినందించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా మచాడోతో మాట్లాడినట్లు నివేదికలు అందుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
అమెరికాతో పాకిస్థాన్ సంబంధాలు క్రమక్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వైట్హౌస్లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు మంచి ఆతిథ్యం లభించింది. ఇద్దరూ గొప్ప నాయకులు అంటూ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు.
ట్రంప్ పరివర్తన చెందిన అధ్యక్షుడు అని కెనడా ప్రధాని మార్క్ కార్నీని ప్రశంసలతో ముంచెత్తారు. మంగళవారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్తో మార్క్ కార్నీ సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
అగ్ర రాజ్యం అమెరికాలో మరో కీలక ముందడుగు పడింది. భారతీయులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ దీపావళి భారతదేశంలోనే కాకుండా ఆయా దేశాల్లో కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందుకు కాలిఫోర్నియా గవర్నర్ తీసుకున్న నిర్ణయమే ఉదాహరణగా నిలుస్తోంది.
ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన తొలి రౌండ్ పరోక్ష చర్చలు సానుకూల వాతావరణంలో ముగిసినట్లుగా తెలుస్తోంది. గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు.
అక్టోబర్ 7, 2023 ఎవరూ మరిచిపోలేని రోజు. ప్రపంచమంతా ఉలిక్కిపడ్డ రోజు. హమాస్ ముష్కరులు ఊహించని రీతిలో ఇజ్రాయెల్లోకి చొరబడి 1,200 మందిని చంపి దాదాపు 251 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన ఇజ్రాయెల్నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది.
ఒసామా బిన్ లాడెన్ను చంపిన వారిని ఎవరూ మరిచిపోరని ట్రంప్ పేర్కొన్నారు. ఆదివారం వర్జీనియాలోని నార్ఫోక్లో అమెరికా నావికాదళం 250వ ఉత్సవాలు సందర్భంగా జరిగిన ప్రత్యేక వేడుకలో ట్రంప్ ప్రసంగించారు.
గాజాలో ఇంకా యుద్ధం ముగియలేదని.. బందీలను బయటకు తీసుకురావడమే తన తొలి ప్రాధాన్యత అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడారు. ట్రంప్ ప్రణాళికకు, బందీలను విడుదల చేయడానికి హమాస్ ప్రాథమికంగా అంగీకరించిందని.