వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కిడ్నాప్ తర్వాత విలేకర్ల సమావేశంలో ట్రంప్ ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు. మదురో మాదిరిగా పుతిన్ను కూడా భవిష్యత్లో కిడ్నాప్ చేస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
జనవరి 3న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లిపోయింది. మదురోతో పాటు ఆయన భార్యను పట్టుకెళ్లిపోయారు. ఈ వ్యవహారం ప్రపంచ దేశాలను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిన్నారులతో కలిసి సందడి చేశారు. వైట్హౌస్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పిల్లలతో కలిసి ట్రంప్ ఆడుకున్నారు.
నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు ఇంటర్నెట్ బంద్ అయింది. నగరాల్లో కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఇక టెహ్రాన్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హింస తీవ్ర రూపం దాల్చింది. నిరసనకారులు వాహనాలు, ఆస్తులు తగలబెట్టారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది చాలా దూకుడుగా ఉన్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారో లేదో వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు గ్రీన్లాండ్పై కన్నుపడింది.
వెనిజులా చమురు విక్రయానికి ట్రంప్ పిలుపునిచ్చారు. 50 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం వైట్హౌస్లో చమురు కంపెనీ అధిపతులతో ట్రంప్ సమావేశం అయ్యారు.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కిడ్నాప్ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. నికోలస్ మదురోను అమెరికాకు తరలించిన తర్వాత డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించింది.
గత శనివారం అగ్ర రాజ్యం అమెరికా అతి పెద్ద సైనిక ఆపరేషన్ చేపట్టింది. అర్ధరాత్రి వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి తీసుకొచ్చేశారు. ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.
ట్రంప్ అన్నట్టుగానే మరొక దేశంపై సైనిక దాడి ప్రారంభించారు. తాజాగా మెక్సికోపై దాడి చేస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. మెక్సికోలో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
అమెరికాలో బుధవారం దారుణం జరిగింది. మిన్నియాపాలిస్లో ఇమ్మిగ్రేషన్ అధికారి జరిపిన కాల్పుల్లో 37 ఏళ్ల రెనీ నికోల్ గుడ్ ప్రాణాలు కోల్పోయింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్కు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళన చేస్తుండగా జరిపిన కాల్పుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.