US-Canada: అమెరికా-కెనడా మధ్య ఉద్రిక్తతలు.. బోర్డ్ ఆఫ్ పీస్ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్
- మరోసారి అమెరికా-కెనడా మధ్య ఉద్రిక్తతలు
- బోర్డ్ ఆఫ్ పీస్ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్
- అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన కెనడా ప్రధాని వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-కెనడా మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొనేలా ఉన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో పరిస్థితులు తారుమారు అయినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ‘బోర్డ్ ఆఫ్ పీస్’’పై కెనడాకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఏదో తేడా కొడుతున్నట్లుగా అనిపిస్తోంది. మరోసారి రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: US: అమానుషం.. 5 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
Also Read
- Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
- Military Tension: ఖేష్మ్, బందర్ అబ్బాస్పై అమెరికా దాడులు.. హార్ముజ్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
గురువారం దావోస్లో ట్రంప్ మాట్లాడుతూ.. కెనడా అమెరికా వల్లే జీవిస్తోందని.. కనీసం కృతజ్ఞత లేదని వ్యాఖ్యానించారు. అయితే దావోస్లో ఉన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ.. ట్రంప్ వాదనను తప్పికొట్టారు. కెనడా అమెరికా వల్ల బ్రతకడం లేదని.. కెనడియన్లం కాబట్టి కెనడా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇక అమెరికా నేతృత్వంలోని ప్రపంచ క్రమంలో ‘చీలిక’ జరుగుతోందని మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు.
కార్నీ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా హైలెట్గా నిలిచాయి. ఈ వ్యాఖ్యలపైనే ట్రంప్ గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచ సంఘర్షణను పరిష్కరించడానికి తాను ఏర్పాటు చేసుకున్న బిలియన్ డాలర్ల సంస్థ ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లో చేరమని కెనడాకు ఇచ్చిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు.
అయితే ట్రంప్ ఆహ్వానాన్ని కార్నీ స్వాగతించారు. బోర్డులో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ట్రంప్ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో కెనడాను అమెరికాలో ఒక రాష్ట్రంగా చేస్తానని ట్రంప్ ప్రకటించారు. కార్నీ ప్రధాని అయ్యాక ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. మళ్లీ ఇప్పుడు పరిస్థితి మారింది.
ఇది కూడా చదవండి: Hum Mein Shahenshah Kaun: 1989లోనే షూట్ కంప్లీట్.. 37 ఏళ్ల తర్వాత తెరపైకి రజినీకాంత్ సినిమా!
తాజావార్తలు
-
TVK Government Formation: తమిళనాడు కోటపై టీవీకే జెండా.. లెఫ్ట్ పార్టీలు, వీసీకే అండతో సీఎం పీఠంపై విజయ్!
-
Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్ది నీచ రాజకీయం’’.. విజయ్తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..
-
Tamil Nadu: ఎంకే.స్టాలిన్ మాస్టర్ ప్లాన్.. తమిళనాడు అట్టుడుకనుందా!?
-
Kalahandi Issues: డిజిటల్ ఇండియాలో ‘మంచమే’ అంబులెన్స్.. గర్భిణిని కిలోమీటరు మోసుకెళ్లిన గ్రామస్థులు!
-
Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి, ఇద్దరు డిప్యూటీలు..?