ఇరాన్లోని చాబహార్ పోర్టును పదేళ్లపాటు నిర్వహించేందుకు టెహ్రాన్తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఓడరేవును నిర్వహించడంతోపాటు భారత్ కూడా దీన్ని అభివృద్ధి చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందానికి సంబంధించి అమెరికా వార్నింగ్ ఇచ్చింది.
Pannun murder plot: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో అమెరికా, భారత దర్యాప్తు కోసం ఎదురుచూస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్ సోమవారం అన్నారు.
Joe Biden : అమెరికాలోని మసీదులు, యూదుల మత స్థలాల కోసం జో బిడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మతపరమైన స్థలాల భద్రత కోసం సమాఖ్య నిధులలో బిలియన్ల రూపాయలను (400 మిలియన్ అమెరికా డాలర్లు అంటే సుమారు 33 బిలియన్లు) ప్రకటించారు.
ఇరాన్తో వ్యాపారం చేసిన పలు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. వీటిలో మూడు భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇరాన్కు చెందిన ఆయుధాలను అక్రమంగా రష్యాకు చేరవేయడంలో సహాయం చేశారనే కారణంతో పలు కంపెనీలు, వ్యక్తులు, నౌకలపై యూఎస్ ఆంక్షల పర్వం కొనసాగిస్తుంది.
విమాన ప్రయాణమన్నా.. ట్రైన్ ప్రయాణాలన్నా.. కొద్ది రోజులు ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. లేదంటే ప్రయాణం సాఫీగా సాగదు. అయితే కొన్ని సార్లు రిజర్వేషన్ అయ్యాక కూడా విమానాలు, ట్రైన్స్ క్యాన్సిల్ అవుతుంటాయి.
Israel: అమెరికా కాంగ్రెస్ ఇజ్రాయెల్ కోసం 13 బిలియన్ డాలర్ల కొత్త సైనిక సహాయాన్ని ఆమోదించింది. మరోవైపు ఇజ్రాయెల్ మిలటరీ బెటాలియన్ పై అమెరికా ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.
పాకిస్థాన్ క్షిపణి వ్యవస్థకు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల కోసం సాంకేతిక వస్తువులను సరఫరా చేసే చైనా, బెలారస్ కంపెనీలను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిషేధించింది.
ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య మరోసారి తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల సిరియాలోని దమస్కు పట్టణంలో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ వైమానిక దాడి తర్వాత మరింత ప్రమాదకరంగా మారింది. ఈ ఘటనలో పలువురు ఇరానీయులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇజ్రాయిల్పై ఇరాన్ రగిలిపోతుంది. ఇప్పటికే హమాస్పై దాడి తర్వాత ఇజ్రాయిల్పై పగతో ఇరాన్ మండిపోతుంది. తాజా ఘటనతో అది కాస్తా ముదిరింది. ఇజ్రాయెల్పై ప్రతి దాడికి ఇరాన్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్.. అమెరికాను హెచ్చరించింది.…
CAA: భారత్ అమలు చేయనున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు కామెంట్స్ చేస్తున్నాయి. భారత అంతర్గత విషయాల్లో ఎక్కువగా కలుగజేసుకుంటున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి హక్కుల విభాగాలు ఈ చట్టం అమలును మతవివక్ష అంటూ వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే, ఇందులో ముస్లింలను మినహాయించడంపై పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Fatty Liver Disease: తీవ్రమైన కాలేయ వ్యాధి ‘ఫ్యాటీ లివర్’కి తొలిసారిగా ఔషధం రాబోతోంది. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారి కోసం డ్రగ్ని US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గురువారం ఆమోదించింది. మాడ్రిగల్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ రూపొందించిన రెజ్డిఫ్రా అనే మందు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వులకు సంబంధించిన తీవ్ర రూపమైన నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH)తో బాధపడుతున్న వారికి ఇది వరంగా మారింది. క్లినికల్ ట్రయల్స్లో ఇది వ్యాధిని మెరుగుపరుస్తున్నట్లు తేలింది.