కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ద్రోహం జరిగిందంటూ వామపక్ష పార్టీల రాష్ట్ర సదస్సులో వక్తలు పేర్కొన్నారు. సదస్సుకు హాజరైన పది వామపక్ష పార్టీలకు చెందిన నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏపీకి కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది. ఈ నెల 21వ తేదీన ప్రధాని విశాఖకు వస్తారని అంటున్నారు.. ఆ రోజున విశాఖ రైల్వై జోన్.. ప్రత్యేక హోదాల మీద ప్రధాని ప్రకటనలు చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబోమని హామీ ఇవ్వాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు.…
కేంద్ర బడ్జెట్ ను ప్రశంసిస్తూ.. రాజ్యసభలో వైసీపీ పాలనపై విమర్శలు చేశారు రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 2014-15లో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన నిధుల కంటే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అన్నారు జీవీఎల్. 2020-21లో, ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం రూ.77,538 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ఆంధ్రప్రదేశ్ నుండి సుమారు రూ.55,000 కోట్లు ఆదాయం పొందిందని ఎంపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్పై…
ఫిబ్రవరి 1 వ తేదీన కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దీనిపై దేశంలోని పలు రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ బడ్జెట్పై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆలోచనాత్మకమైన విధాన ఎజెండాగా ఐఎంఎఫ్ వర్ణించింది. పరిశోధన అభివృద్దిలో నూతన ఆవిష్కరణలతో పాటు హ్యుమన్ క్యాపిటల్, డిజిటలైజేషన్కు ప్రాధాన్యత ఇచ్చారని ఐఎంఎఫ్ పేర్కొన్నది. Read: ‘సంస్కార్ కాలనీ’లో ఎస్తర్ కు ఏం పని!? ప్రస్తుతం భారత వృద్దిరేటు…
నిర్మలమ్మ బడ్జెట్లో ఊరట కలిగించే అంశం ఏదైనా వుందంటే అది గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడమే అంటున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వారికి కాస్త ఊరట లభించింది. వాణిజ్య సిలిండర్ ధరను రూ.91 తగ్గించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దీంతో దేశ రాజధానిలో రూ.2000కుపైగా ఉన్న ఈ సిలిండిర్ ధర రూ.1907కు దిగొచ్చింది. సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. కమర్షియల్ సిలిండర్ ధర తరచూ…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలమనే విశ్వాసం మనకుందని, ప్రపంచంలోనే మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆమీ అన్నారు. అంతేకాకుండా.. వచ్చే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను రూపొందించామని…