Volodymyr Zelenskyy: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధంలో ఉక్రెయిన్ వైపు నుండి ఓ నిర్ణయాత్మక చర్య కనిపిస్తుంది. ఇప్పుడు రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోని సుడ్జా నగరాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్వయంగా ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యం రష్యాలోకి 35 కిలోమీటర్లు చొచ్చుకుపోయిందని, గత 10 రోజుల్లో 82 రష్యన్ గ్రామాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. రష్యాలోని పశ్చిమ కుర్స్క్లో ఉక్రెయిన్ తన స్వంత సైనిక కార్యాలయాన్ని కూడా…
ఉక్రెయిన్ ఎదురుదాడికి రష్యా వణికిపోయింది. గత ఎనిమిది నెలల్లో పుతిన్ బలగాలు ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్నంత రష్యా భూమిని చిన్న దాడితో ఎనిమిది రోజుల్లో ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ దాడితో ఆగ్రహానికి గురయ్యాడు. శత్రువులను తరిమికొట్టడానికి కుర్స్క్కు మరిన్ని దళాలను మోహరించాలని క్రెమ్లిన్కు పిలుపునిచ్చారు.
PM Modi Ukraine Visit: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటీవల మోడీ రష్యాలో పర్యటించారు.
PM Modi Ukraine Tour: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. రష్యా సైనికుల ఆగడాలు మాత్రం ఆగట్లేదు. ఇప్పటి వరకు దాదాపు 10,000 వేల మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా సైన్యం చేతిలో బంధీలుగా ఉన్నట్టు తెలుస్తుంది.
Russia- Ukraine War: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని తొందరలోనే ముగించేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడాలని భారతదేశానికి అగ్రరాజ్యం అమెరికా కోరింది.
Ukrainian President: రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 22వ భారత్- రష్యా శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు కలిశారు.
US React PM Modi Russia Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా రియాక్ట్ అయింది. ఈ విషయమై యూఎస్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు.. రష్యాతో మైత్రి కొనసాగింపుపైనా తమ ఆందోళనలను ఎప్పటికప్పుడు భారతదేశానికి తెలియజేస్తున్నామన్నారు.
మాస్కో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య ఇవాళ (మంగళవారం) విస్తృత చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రతినిధి స్థాయి చర్చలు కూడా ఉంటాయిని అధికారులు చెప్పారు.
నెలల తరబడి ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యా దళాలు చివరకు ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రావిన్స్లోని చాసివ్ యార్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ నగరం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
స్విట్జర్లాండ్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్లో శాంతికి సంబంధించిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ వెనుకడుగు వేసింది. ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా హాజరు కాకూడదని నిర్ణయించుకుంది.