సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ భార్య అస్మా యూకేకి తిరిగి రాలేదని బ్రిటన్ ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. బ్రిటిష్-సిరియా జాతీయురాలైన అస్మా.. భర్త అసద్ పాలనలోని యుద్ధ నేరాల్లో ఆమె పాత్ర కారణంగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రయాణ నిషేధాలు, ఆస్తుల జప్తులు అమల్లో ఉన్నాయి.
సిరియాలో అధికారం కోల్పోయిన అసద్ కుటుంబంతో సహా రష్యాలో తలదాచుకున్నారు. ఈ తరుణంలో అస్మా భర్త నుంచి విడాకులు కోరుతూ రష్యా కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
తమిళనాడులో మళ్లీ అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు చిగురుస్తున్నట్లు కనిపిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేశాయి. దీంతో రెండు పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. తిరిగి రెండు పార్టీల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి అన్నామలై చేసిన సానుకూల వ్యాఖ్యలే కారణంగా తెలుస్తోంది.
RBI Gold: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా ధన్తేరస్పై కొనుగోళ్లను చేసింది. ఇంగ్లాండ్ నుంచి భారత్కు కొత్తగా 102 టన్నుల బంగారం దిగుమతి అయింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి 102 టన్నుల బంగారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదిలీ అయింది. అంతకుముందు మే నెలలో బ్రిటన్ నుంచి 100 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ దిగుమతి చేసుకుంది. దింతో సెప్టెంబర్ చివరి నాటికి ఆర్బీఐ వద్ద మొత్తం 855 టన్నుల బంగారం ఉంది.…
బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా కంపెనీ ఓ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చింది. ఆ వ్యక్తి కంపెనీకి కంపెనీకి తప్పుడు వివరాలను అందించినట్లు కంపెనీ గుర్తించింది. ఆ వ్యక్తి ఓ సైబర్ నేరగాడని తేలడంతో ఆశ్చర్యానికి గురైంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం యొక్క బిడ్కు యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు ఇచ్చాయి. తాజాగా భూటాన్, పోర్చుగల్ కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది.
పాకిస్థాన్ జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ (71) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ పదవికి దరఖాస్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన సలహాదారు సయ్యద్ బుఖారీ ధృవీకరించారు. ఏడాదికి పైగా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆదివారం రాత్రి గడువు కంటే ముందే దరఖాస్తును సమర్పించినట్లు వెల్లడించారు.