Hindi Movie Nominated Oscar: ఆస్కార్ రేసులో మరో హిందీ సినిమా!.. కథ అదుర్స్
- భారత్ నుంచి ఆస్కార్ కి 'లాపత్తా లేడీస్' చిత్రం
- తాజాగా యూకే నుంచి ఆస్కార్ కి మరో హిందీ చిత్రం ఎంపిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా.. భారత్ నుంచి ‘లాపత్తా లేడీస్’ చిత్రం ఆస్కార్ అవార్డ్స్లో అధికారిక ప్రవేశం కానుందన్న ప్రకటన భారతీయ సినీ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచింది. బారిలో 29 సినిమాలు పోటీ పడగా ‘లాపతా లేడీస్’ అర్హత సాధించింది. ఇప్పుడు భారతీయ సినీ ప్రేమికులకు ఆనందాన్ని పంచే మరో వార్త యునైటెడ్ కింగ్డమ్ (యుకె) నుంచి వెలువడింది. హిందీలో నిర్మించి ‘సంతోష్’ అనే చిత్రం ఉత్తమ అంతర్జాతీయ ఫిచర్ ఫిల్మ్ విభాగంలో ఈ అర్హత సాధించింది. ఈ చిత్రం యూకే నుంచి నామినేట్ చేయబడింది. బ్రిటీస్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యాసూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ కి యూకే నుంచి ఎంపిక అవ్వడం తమ కృషి ఫలితంగా భావిస్తున్నట్లు నటిగోస్వామి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో గోస్వామితో పాటు సునీతా రాజ్ వర్ ప్రధాన పాత్ర పోషించారు.
READ MORE: YS Jagan: వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు
Also Read
- LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
సంతోష్ చిత్రంలో సహానా గోస్వామి, సునీతా రాజ్వార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమా వెనుక బ్రిటిష్ నిర్మాతలు ఉండటంతో ఇది ఆస్కార్కు బ్రిటన్ నుంచి అర్హత సాధించింది. బ్రిటన్లో అనేక ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మైక్ గూడ్రిజ్, జేమ్స్ బోషెర్, బల్తాజర్ డే గానే, అలన్ మెక్అలెక్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. అమా అమ్పాడు, ఎవా యేట్స్, దియర్మిద్ స్ర్కిమ్షా, లూసియా హాస్లావుర్, మార్టిన్ గెర్హార్డ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. గూడ్ కయోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆస్కార్స్లో ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం అవసరాల రీత్యా ఆంగ్లేతర సినిమాలను యూకే అప్పుడప్పుడు ఎంపిక చేస్తుంటుంది. ఈ సినిమాకు సూరి దర్శకత్వం వహించారు.
READ MORE:China: చైనాలో మరోసారి భయంకర మాంద్యం! ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం?
ఈ సినిమా కథ.. ఉత్తరభారతేదశంలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. కొత్తగా పెళ్లైయిన ఓ మహిళ సంతోష్ (గోస్వామి) కొంత కాలం తర్వాత ఆమె భర్త చనిపోవడంతో ఒక ప్రభుత్వ పథకం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగం పొందుతుంది. దళిత కులానికి సంబంధించిన అమ్మాయి హత్య కేసును చేధించే క్రమంలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? అనే ఆసక్తికర క్రైమ్ స్టోరీ అల్లారు. వివక్ష కారణంగా సమాజంలో మహిళలు ఎలా వేధించబడుతున్నారు? ఇలాంటి విషయాలను సంతోష్ ఎలా వెలుగులోకి తెచ్చింది? అన్నది ఆసక్తికరంగా మలిచారు.
తాజావార్తలు
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
-
Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
-
Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్కు వెళ్లాలా.?
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!