Hindi Movie Nominated Oscar: ఆస్కార్ రేసులో మరో హిందీ సినిమా!.. కథ అదుర్స్
- భారత్ నుంచి ఆస్కార్ కి 'లాపత్తా లేడీస్' చిత్రం
- తాజాగా యూకే నుంచి ఆస్కార్ కి మరో హిందీ చిత్రం ఎంపిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా.. భారత్ నుంచి ‘లాపత్తా లేడీస్’ చిత్రం ఆస్కార్ అవార్డ్స్లో అధికారిక ప్రవేశం కానుందన్న ప్రకటన భారతీయ సినీ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచింది. బారిలో 29 సినిమాలు పోటీ పడగా ‘లాపతా లేడీస్’ అర్హత సాధించింది. ఇప్పుడు భారతీయ సినీ ప్రేమికులకు ఆనందాన్ని పంచే మరో వార్త యునైటెడ్ కింగ్డమ్ (యుకె) నుంచి వెలువడింది. హిందీలో నిర్మించి ‘సంతోష్’ అనే చిత్రం ఉత్తమ అంతర్జాతీయ ఫిచర్ ఫిల్మ్ విభాగంలో ఈ అర్హత సాధించింది. ఈ చిత్రం యూకే నుంచి నామినేట్ చేయబడింది. బ్రిటీస్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యాసూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ కి యూకే నుంచి ఎంపిక అవ్వడం తమ కృషి ఫలితంగా భావిస్తున్నట్లు నటిగోస్వామి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో గోస్వామితో పాటు సునీతా రాజ్ వర్ ప్రధాన పాత్ర పోషించారు.
READ MORE: YS Jagan: వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
సంతోష్ చిత్రంలో సహానా గోస్వామి, సునీతా రాజ్వార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమా వెనుక బ్రిటిష్ నిర్మాతలు ఉండటంతో ఇది ఆస్కార్కు బ్రిటన్ నుంచి అర్హత సాధించింది. బ్రిటన్లో అనేక ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మైక్ గూడ్రిజ్, జేమ్స్ బోషెర్, బల్తాజర్ డే గానే, అలన్ మెక్అలెక్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. అమా అమ్పాడు, ఎవా యేట్స్, దియర్మిద్ స్ర్కిమ్షా, లూసియా హాస్లావుర్, మార్టిన్ గెర్హార్డ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. గూడ్ కయోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆస్కార్స్లో ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం అవసరాల రీత్యా ఆంగ్లేతర సినిమాలను యూకే అప్పుడప్పుడు ఎంపిక చేస్తుంటుంది. ఈ సినిమాకు సూరి దర్శకత్వం వహించారు.
READ MORE:China: చైనాలో మరోసారి భయంకర మాంద్యం! ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం?
ఈ సినిమా కథ.. ఉత్తరభారతేదశంలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. కొత్తగా పెళ్లైయిన ఓ మహిళ సంతోష్ (గోస్వామి) కొంత కాలం తర్వాత ఆమె భర్త చనిపోవడంతో ఒక ప్రభుత్వ పథకం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగం పొందుతుంది. దళిత కులానికి సంబంధించిన అమ్మాయి హత్య కేసును చేధించే క్రమంలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? అనే ఆసక్తికర క్రైమ్ స్టోరీ అల్లారు. వివక్ష కారణంగా సమాజంలో మహిళలు ఎలా వేధించబడుతున్నారు? ఇలాంటి విషయాలను సంతోష్ ఎలా వెలుగులోకి తెచ్చింది? అన్నది ఆసక్తికరంగా మలిచారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!