Hindi Movie Nominated Oscar: ఆస్కార్ రేసులో మరో హిందీ సినిమా!.. కథ అదుర్స్
- భారత్ నుంచి ఆస్కార్ కి 'లాపత్తా లేడీస్' చిత్రం
- తాజాగా యూకే నుంచి ఆస్కార్ కి మరో హిందీ చిత్రం ఎంపిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా.. భారత్ నుంచి ‘లాపత్తా లేడీస్’ చిత్రం ఆస్కార్ అవార్డ్స్లో అధికారిక ప్రవేశం కానుందన్న ప్రకటన భారతీయ సినీ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచింది. బారిలో 29 సినిమాలు పోటీ పడగా ‘లాపతా లేడీస్’ అర్హత సాధించింది. ఇప్పుడు భారతీయ సినీ ప్రేమికులకు ఆనందాన్ని పంచే మరో వార్త యునైటెడ్ కింగ్డమ్ (యుకె) నుంచి వెలువడింది. హిందీలో నిర్మించి ‘సంతోష్’ అనే చిత్రం ఉత్తమ అంతర్జాతీయ ఫిచర్ ఫిల్మ్ విభాగంలో ఈ అర్హత సాధించింది. ఈ చిత్రం యూకే నుంచి నామినేట్ చేయబడింది. బ్రిటీస్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యాసూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ కి యూకే నుంచి ఎంపిక అవ్వడం తమ కృషి ఫలితంగా భావిస్తున్నట్లు నటిగోస్వామి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో గోస్వామితో పాటు సునీతా రాజ్ వర్ ప్రధాన పాత్ర పోషించారు.
READ MORE: YS Jagan: వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
సంతోష్ చిత్రంలో సహానా గోస్వామి, సునీతా రాజ్వార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమా వెనుక బ్రిటిష్ నిర్మాతలు ఉండటంతో ఇది ఆస్కార్కు బ్రిటన్ నుంచి అర్హత సాధించింది. బ్రిటన్లో అనేక ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మైక్ గూడ్రిజ్, జేమ్స్ బోషెర్, బల్తాజర్ డే గానే, అలన్ మెక్అలెక్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. అమా అమ్పాడు, ఎవా యేట్స్, దియర్మిద్ స్ర్కిమ్షా, లూసియా హాస్లావుర్, మార్టిన్ గెర్హార్డ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. గూడ్ కయోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆస్కార్స్లో ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం అవసరాల రీత్యా ఆంగ్లేతర సినిమాలను యూకే అప్పుడప్పుడు ఎంపిక చేస్తుంటుంది. ఈ సినిమాకు సూరి దర్శకత్వం వహించారు.
READ MORE:China: చైనాలో మరోసారి భయంకర మాంద్యం! ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం?
ఈ సినిమా కథ.. ఉత్తరభారతేదశంలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. కొత్తగా పెళ్లైయిన ఓ మహిళ సంతోష్ (గోస్వామి) కొంత కాలం తర్వాత ఆమె భర్త చనిపోవడంతో ఒక ప్రభుత్వ పథకం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగం పొందుతుంది. దళిత కులానికి సంబంధించిన అమ్మాయి హత్య కేసును చేధించే క్రమంలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? అనే ఆసక్తికర క్రైమ్ స్టోరీ అల్లారు. వివక్ష కారణంగా సమాజంలో మహిళలు ఎలా వేధించబడుతున్నారు? ఇలాంటి విషయాలను సంతోష్ ఎలా వెలుగులోకి తెచ్చింది? అన్నది ఆసక్తికరంగా మలిచారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!