Tamil nadu: మళ్లీ చిగురుస్తున్న అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు! అన్నామలై వ్యాఖ్యల్లో మార్పు!
- మళ్లీ చిగురుస్తున్న అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు!
- బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై వ్యాఖ్యల్లో మార్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో మళ్లీ అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు చిగురుస్తున్నట్లు కనిపిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేశాయి. దీంతో రెండు పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. తిరిగి రెండు పార్టీల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి అన్నామలై చేసిన సానుకూల వ్యాఖ్యలే కారణంగా తెలుస్తోంది.
సెప్టెంబర్ 2023లో ఎన్డీఏ నుంచి అన్నాడీఎంకే బయటకు వచ్చేసింది. అంతకముందు రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. దీంతో బీజేపీతో పొత్తు ఉండదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఇటీవల ప్రకటించారు. అయితే బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై యూకే పర్యటన తర్వాత అతని స్వరంలో మార్పు కనిపించింది. అన్నాడీఎంకేతో పొత్తుపై త్వరలో క్లారిటీ వస్తుందని వ్యాఖ్యానించారు. తమిళనాడులో డీఎంకేను గద్దె దించడమే తమ ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. మళ్లీ కూటమి ఏకమవుతుందా? అంటే మాత్రం ఇవన్నీ అవకాశాలేనని తెలిపారు. 2025 నాటికి మాత్రం ఒక స్పష్టత రావొచ్చని అన్నామలై పేర్కొన్నారు.
Also Read
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
- ఒకే రీఛార్జ్లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
ఇది కూడా చదవండి: Formula E-Car Case: కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు..
అన్నాడీఎంకే నేతలపై, జయలలితపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు కారణంగానే రెండు పార్టీలు విడిపోయాయి. అప్పటి వరకూ కలిసి పోటీ చేసిన పార్టీలు.. 2024 లోక్సభ ఎన్నికల సమయానికి విడిపోయాయి. ఫలితంగా బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. భారీగా నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి రెండు పార్టీలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. అన్నాడీఎంకే మాత్రం సయోధ్య కుదిరే అవకాశాలను తీవ్రంగా తోసిపుచ్చింది. ఏఐఏడీఎంకే సీనియర్ అధికార ప్రతినిధి కోవై సత్యన్ మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు లేదని ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. మహారాష్ట్రలో శివసేనకు ఏం జరిగిందో తమకు తెలుసు అన్నారు.
ఇది కూడా చదవండి: Pushpa 2: అల్లు అర్జున్ కి మరో షాక్.. హ్యూమన్ రైట్స్ కి ఫిర్యాదు
తాజావార్తలు
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!