Tamil nadu: మళ్లీ చిగురుస్తున్న అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు! అన్నామలై వ్యాఖ్యల్లో మార్పు!
- మళ్లీ చిగురుస్తున్న అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు!
- బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై వ్యాఖ్యల్లో మార్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో మళ్లీ అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు చిగురుస్తున్నట్లు కనిపిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేశాయి. దీంతో రెండు పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. తిరిగి రెండు పార్టీల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి అన్నామలై చేసిన సానుకూల వ్యాఖ్యలే కారణంగా తెలుస్తోంది.
సెప్టెంబర్ 2023లో ఎన్డీఏ నుంచి అన్నాడీఎంకే బయటకు వచ్చేసింది. అంతకముందు రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. దీంతో బీజేపీతో పొత్తు ఉండదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఇటీవల ప్రకటించారు. అయితే బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై యూకే పర్యటన తర్వాత అతని స్వరంలో మార్పు కనిపించింది. అన్నాడీఎంకేతో పొత్తుపై త్వరలో క్లారిటీ వస్తుందని వ్యాఖ్యానించారు. తమిళనాడులో డీఎంకేను గద్దె దించడమే తమ ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. మళ్లీ కూటమి ఏకమవుతుందా? అంటే మాత్రం ఇవన్నీ అవకాశాలేనని తెలిపారు. 2025 నాటికి మాత్రం ఒక స్పష్టత రావొచ్చని అన్నామలై పేర్కొన్నారు.
Also Read
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఇది కూడా చదవండి: Formula E-Car Case: కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు..
అన్నాడీఎంకే నేతలపై, జయలలితపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు కారణంగానే రెండు పార్టీలు విడిపోయాయి. అప్పటి వరకూ కలిసి పోటీ చేసిన పార్టీలు.. 2024 లోక్సభ ఎన్నికల సమయానికి విడిపోయాయి. ఫలితంగా బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. భారీగా నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి రెండు పార్టీలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. అన్నాడీఎంకే మాత్రం సయోధ్య కుదిరే అవకాశాలను తీవ్రంగా తోసిపుచ్చింది. ఏఐఏడీఎంకే సీనియర్ అధికార ప్రతినిధి కోవై సత్యన్ మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు లేదని ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. మహారాష్ట్రలో శివసేనకు ఏం జరిగిందో తమకు తెలుసు అన్నారు.
ఇది కూడా చదవండి: Pushpa 2: అల్లు అర్జున్ కి మరో షాక్.. హ్యూమన్ రైట్స్ కి ఫిర్యాదు
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?