Jaishankar security breach: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లండన్ పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరిగింది. ఆయన ఓ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి కారు ఎక్కే సమయంలో ఖలిస్తానీలు నినాదాలు చేయడంతో పాటు ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని జైశంకర్ సమీపంలోకి రావడం, కారుని అడ్డుకునే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై యూకే ప్రకటనపై భారత్ శుక్రవారం స్పందించింది. యూకే ఉదాసీనతను ఈ ఘటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ…
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ లండన్ పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం ఎదురైంది. ఖలిస్తానీ అనుకూల వర్గాలు జైశంకర్ వైపు దూసుకు రావడం సంచలనంగా మారింది. బుధవారం రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఇంటరాక్టివ్ సెషన్ తర్వాత మిస్టర్ జైశంకర్ చాథమ్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పుడు, ఒక ఖలిస్తానీ అనుకూల నిరసనకారుడు బారికేడ్లను దాటి, జైశంకర్ వైపుగా వచ్చి, భారత వ్యతిరేక నినాదాలు చేశారు.
Racist comments: భారత సంతతికి చెందిన మహిళను ఉద్దేశిస్తూ ఇంగ్లాండ్ వ్యక్తి చేసిన ‘‘జాతి విద్వేష వ్యాఖ్యలు’’ వైరల్గా మారాయి. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో తప్పతాగి ఉన్న వ్యక్తి భారత్తో పాటు ఆ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లండన్ నుంచి మాంచెస్టర్కి రైలులో వెళ్తున్న క్రమంలో 26 ఏళ్ల భారత సంతతి మహిళ గాబ్రియెల్ ఫోర్సిత్ జాతివిద్వేషాన్ని ఎదుర్కొన్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పని దినాలు గురించి చర్చలు జరుగుతున్న వేళ యూకే కంపెనీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. వారానికి నాలుగు రోజులే పని దినాలుగా ప్రకటించాయి.
Priyanka Chaturvedi: యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో ‘‘పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్’’ అరచకాలపై అక్కడి ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని విమర్శిస్తున్నారు. జాతీయ విచారణకు అక్కడి ప్రభుత్వ నో చెప్పడంపై విమర్శలు వెల్లువెతున్నాయి.
Om Birla: యూకే పర్యటనకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెళ్లారు. ఈ సందర్భంగా లండన్లోని హైకమిషన్లో జరిగిన సమావేశంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను, వృద్ధిని యూకే బలంగా విశ్వసిస్తోందని తెలిపారు.
Britain PM vs Elon Musk: బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్పై అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ విమర్శలకు బ్రిటన్ సర్కార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
UK: యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగులపై అక్కడి ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిని ‘‘రేప్ గ్యాంగ్’’గా పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా యూకే వ్యాప్తంగా 1997-2013 మధ్య జరిగిన ‘‘రోథర్హామ్ స్కాండల్’’పై పెద్ద యుద్ధమే జరుగుతోంది.
Pakistan: ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా పేరుగాంచిన పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరింది. రొటేషన్ పద్ధతిలో పాక్ కు ఈ ఛాన్స్ వచ్చింది.
సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ భార్య అస్మా మరణపు అంచుల్లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తీవ్రమైన కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.