ఓ వైపు కరోనా విజృంభిస్తోంది.. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉంది.. కానీ, ఇదే సమయంలో ఓ పార్టీ జరిగింది.. అది కూడా ప్రధాని నివాసం ఉన్న వీధిలోనే.. ఇదే ఇప్పుడు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను చిక్కుల్లో పడేసింది… ఆయన నివాసం ఉండే డౌనింగ్ స్ట్రీట్లో జరిగిన ఓ పార్టీ వ్యవహారంలో పోలీసులు ఆయనకు పలు ప్రశ్నలతో కూడిన లేఖను రాశారు.. వాటికి సమాధానం ఇచ్చేందుకు వారం రోజుల డెడ్లైన్ పెట్టారు.. ఈ…
ఆన్లైన్ లో ఒక వస్తువును బుక్ చేస్తే మరోక వస్తువు వస్తుంది. చిన్న చిన్న వస్తువులు అయితే సరే అనుకోవచ్చు. కానీ, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో కూడా ఇలానే జరుగుతుంటుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసిన సమయంలో కొందరికి ఫోన్ లకు బదులు ఇటుకలు, రాళ్లు, సోపులు వస్తుంటాయి. తాజాగా ఇంగ్లాండ్ కు చెందిన ఓ మహిళ ఐఫోన్ 13 ప్రో మొబైల్ను కొనుగోలు చేసింది. ఈ మొబైల్ డెలివరీ కోసం అదనంగా…
ఈరోజుల్లో ఒకరిద్దరు సంతానం అంటే సరే అనుకోవచ్చు. కొంతమందికి ఎంత ప్రయత్నించినా అసలు సంతానం కలగదు. కానీ, ఆ వ్యక్తి ఇప్పటి వరకు 129 మంది సంతానానికి తండ్రి అయ్యాడు. మరో 9 మంది సంతానానికి తండ్రి కాబోతున్నాడు. దీనిని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు. కానీ, ఆయనకు ఇదే కొత్త చిక్కులు తెచ్చిపెట్టబోతున్నాయి. ఇంత మందిని ఎలా కన్నాడు అనే డౌట్ రావొచ్చు. స్పెర్మడోనార్ ద్వారా ఆయన ఇంత మందికి తండ్రి అయ్యాడు. ఆధునిక కాలంలో స్పెర్మ్…
యూరప్ లో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కరోనా కారణంగా బ్రిటన్ అతలాకుతలం అయింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఈ దేశంలోనే విధ్వంసం సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా ఈ దేశంలో ఒమిక్రాన్ విరుచుకుపడింది. వ్యాక్సిన్ను అందిస్తుండటంతో కరోనా బారిన పడినప్పటికీ పెద్దగా మరణాలు సంభవించలేదు. దీంతో కరోనా మొదటి వేవ్ సమయంలో 14 రోజుల క్వారంటైన్ ఉండగా, ఆ తరువాత వారం రోజులకు తగ్గించారు. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇప్పుడిప్పుడు…
కరోనా మహామ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. సామాన్యులతో పాటు వైద్యులు, వైద్యసిబ్బందికి, నర్సులకు కరోనా సోకుతున్నది. ఇక యూకే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూకేలో ప్రతిరోజు భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారీగా కేసులు నమోదవుతున్నా లక్షణాలు తక్కువ స్థాయిలో ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. అయితే, యూకేలోని లింకన్షైర్కు చెందిన మోనికా అనే మహిళా నర్సుకు నవంబర్ 9 వ తేదీన కరోనా సోకింది. కరోనా బారిన పడ్డ అ నర్స్ను ఆసుపత్రిలో…
వ్యాపార రంగంలో రిలయన్స్కు ఎదురేలేదు.. కొత్త రంగాలకు వ్యాపారాలను విస్తరిస్తూ.. లాభాలను ఆర్జిస్తూనే ఉంది ఆ సంస్థ.. ఇక, గ్రీన్ ఎనర్జీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది ఆ సంస్థ.. ఇప్పటికే జామ్నగర్ దగ్గర గిగా ఫ్యాక్టరీ పనులు కొనసాగిస్తూనే మరోవైపు గ్రీన్ టెక్నాలజీలో వివిధ సంస్థలతో చేతులు కలుపుతోంది.. అందులో భాగంగా.. సోడియం ఐయాన్ బ్యాటరీ టెక్నాలజీలో ప్రపంచంలోనే మంచి పేరు పొందిన ఫారడియన్ కంపెనీని రియలన్స్ కొనేసింది.. ఆ కంపెనీకి సంబంధించిన వంద…
కరోనా, ఒమిక్రాన్తో యూకే వణికిపోతున్నది. ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. క్రిస్మస్ తరువాత కేసులు మరింతగా పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మంగళవారం రోజున యూకేలో 1.30 లక్షల కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలియజేసంది. కేసులతో పాటు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ లండన్లో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది.…
ఒమిక్రాన్ వేరియంట్తో బ్రిటన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ప్రతిరోజూ లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బ్రిటన్లో 1,22,186 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు లక్షకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తరువాతనే కరోనా వ్యాప్తి ఈ స్థాయికి చేరింది. మరికొన్ని రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. Read: ఇంతకంటే ఆనందం ఇంకేంకావాలి… ఆనంద్ మహీంద్రా ట్వీట్… డిసెంబర్…
చిన్న చిన్న తప్పులు చేయడం సహజమే. కొన్నిసార్లు అవసరం లేదని పడేసిన వస్తువుల విలువ భారీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలానే యూకేకు చెందని జేమ్స్ హువెల్స్ మాజీ భార్య 2013 వ సంవత్సరంలో పనికి రాదేమో ఆని చెప్పి ఓ హార్డ్ డిస్క్ను చెత్తబుట్టలో పడేసింది. ఆ హార్డ్ డిస్క్ విలువ ఇప్పుడు రూ.3,404 కోట్లు. వామ్మో అంత విలువనా… అందులో ఏముంది అనే డౌట్ రావొచ్చు. ఆ హార్డ్ డిస్క్లో 7500 బిట్ కాయిన్స్…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో పెద్దగా ముప్పు లేదనే అంచనాలున్నాయి.. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది.. డెత్ రేట్ చాలా తక్కువంటూ ప్రచారం సాగింది.. కానీ, ఒమిక్రాన్ బారినపడి ఏకంగా 12 మంది మృతిచెందినట్టు అధికారికంగా ప్రకటించింది బ్రిటన్.. యూకేలో ఇప్పటి వరకు ఒమిక్రాన్తో 104 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారని ఇవాళ వెల్లడించిన బ్రిటన్ ఉప ప్రధానమంత్రి డొమినిక్ రాబ్.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 12 మంది ఒమిక్రాన్ బాధితులు…