ఆన్లైన్ లో ఒక వస్తువును బుక్ చేస్తే మరోక వస్తువు వస్తుంది. చిన్న చిన్న వస్తువులు అయితే సరే అనుకోవచ్చు. కానీ, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో కూడా ఇలానే జరుగుతుంటుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసిన సమయంలో కొందరికి ఫోన్ లకు బదులు ఇటుకలు, రాళ్లు, సోపులు వస్తుంటాయి. తాజాగా ఇంగ్లాండ్ కు చెందిన ఓ మహిళ ఐఫోన్ 13 ప్రో మొబైల్ను కొనుగోలు చేసింది. ఈ మొబైల్ డెలివరీ కోసం అదనంగా డబ్బులు కూడా చెల్లించింది.
Read: శాస్త్రవేత్తల పరిశోధన: భూమిపై జీవం ఆవిర్భవించడానికి అవే కారణం…
అదనంగా డబ్బులు చెల్లించడంతో మరుసటి రోజే పార్శిల్ రావాల్సి ఉన్నా మూడు రోజుల తరువాత పార్శిల్ వచ్చింది. వచ్చిన ఆ పార్శిల్ను విప్పి చూసి ఆ మహిళ షాక్ అయింది. ఐఫోన్ 13 ప్రో స్థానంలో ఆమెకు సోప్ బాక్స్ వచ్చింది. వెంటనే తాను బుక్ చేసుకున్న స్కై మొబైల్ ప్లాట్ఫామ్కు ఫోన్ చేసింది. కానీ ఎవరూ రెస్పాండ్ కాలేదని వాపోయింది. మొబైల్ ఫోన్ ధర 150 పౌండ్లు అని, మొబైల్ స్థానంలో ఇలా తనకు సోప్ బాటిల్ పంపారని వాపోయింది.