బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అక్టోబర్లో భారత్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా తేదీలు ప్రకటించనప్పటికీ అక్టోబర్ చివరి నాటికి భారత్లో పర్యటించే ఛాన్సుందని తెలుస్తోంది. ఇక ముంబైలో జరిగే ఫిన్టెక్ సమావేశంలో కూడా కీర్ స్టార్మర్ పాల్గొంటారని సమాచారం.
గాజాను స్వాధీనం చేసుకోవాలన్న తీర్మానానికి ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హమాస్ను అంతం చేసి గాజాను స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారత్ తో పాటు ప్రపంచ దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 242 మంది ప్రయాణిస్తున్న విమానం క్షణాల్లోనే క్రాష్ అయి మంటల్లో చిక్కుకుని కాలిబూదిదైపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 130 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. కొందరు ఘటనా స్థలంలోనే సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో భారతీయులతో పాటు విదేశీయులు సైతం భారీగానే ఉన్నారు. ఈ విమానంలో దాదాపు 53 మంది బ్రిటిష్ జాతీయులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో…
లండన్లో జరిగిన ఎన్నికల్లో లేబర్ భారీ ఘనవిజయం నమోదు చేసింది. దాదాపు 400 సీట్లకు పైగా గెలుచుకుంది. దీంతో ప్రధాన మంత్రిగా కీర్ స్టార్మర్ ఎన్నికయ్యారు అలాగే కింగ్ ఛార్లెస్-3 కూడా కీర్ నియామకాన్ని ఆమోదించారు.
లండన్లో లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయ్యారు. అనంతరం బకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ చార్లెస్-3ని కలిశారు. కింగ్ ఛార్లెస్-3... కీర్ స్టార్మర్నియామకాన్ని ఆమోదించారు.
ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమ్మిట్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 2022లో యూకే ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి సునక్ భారతదేశానికి రావడం ఇదే తొలిసారి.
దేశ రాజధానిలో జరగనున్న జీ20 సమ్మిట్లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.
ఉక్రెయిన్ కు తాము దీర్ఘ శ్రేణి క్షిపణులు పంపుతామని బ్రిటన్ ఇటీవలే ప్రకటించింది. ఇంకా ఏం చేయాలన్న విషయంపై జెలెన్ స్కీతో చర్చించానని రిషి సునక్ ఇవాళ వెల్లడించారు. తమకు సాయం చేస్తున్నందుకు ఉక్రెయిన్ ప్రజల తరఫున, సైనికుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నానని జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు.
తన కుమార్తె అక్షతామూర్తి తన భర్తను ప్రధాన మంత్రిని చేసిందని యూకే ప్రధాని రిషి సునాక్ అత్త సుధామూర్తి అన్నారు. రిషి సునాక్ త్వరగా అధికారంలోకి వచ్చారని.. అయితే అది తన కూతురి వల్లే సాధ్యమైందని సుధామూర్తి పేర్కొన్నారు.
బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి రిషి సునాక్ విదేశాంగ విధానంపై రిషి సునాక్ ప్రసంగించారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. చైనాతో మాత్రం ఇందుకు విరుద్ధంగా పనిచేస్తామని తేల్చి చెప్పారు.