UK-Israel: గాజాను స్వాధీనం చేసుకునే నిర్ణయం సరైంది కాదు.. బ్రిటన్ ప్రధాని అభ్యంతరం
- గాజాను స్వాధీనం చేసుకునే నిర్ణయం సరైంది కాదు
- బ్రిటన్ ప్రధాని అభ్యంతరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాను స్వాధీనం చేసుకోవాలన్న తీర్మానానికి ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హమాస్ను అంతం చేసి గాజాను స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తప్పుపట్టారు. ఈ నిర్ణయం సరైంది కాదని.. దీనిపై వెంటనే పునరాలోచన చేయాలని కోరారు. గతంలో కూడా కాల్పులు ఆపకపోతే.. పాలస్తీనాకు మద్దతు తెల్పుతామని కీర్ స్టార్మర్ హెచ్చరించారు. ఈ ప్రకటనను అప్పట్లో నెతన్యాహు ఖండించారు.
ఇది కూడా చదవండి: Cyber Fraud: వృద్ధుడిపై వలపు వల.. రూ.9 కోట్లు సమర్పయామి
Also Read
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- Jammu Kashmir: పాక్కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
తాజాగా మరోసారి ఇజ్రాయెల్ మంత్రివర్గ నిర్ణాయాన్ని కీర్ స్టార్మర్ తప్పుపట్టారు. గాజాను స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ దాడులు మొదలు పెడితే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందన్నారు. ఇది చాలా తప్పుడు నిర్ణయం అన్నారు. తక్షణమే పునఃపరిశీలించాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చర్య మరింత వివాదానికి దారి తీస్తుంది తప్ప.. బందీల విడుదలకు సురక్షితం కాదని.. మరింత రక్తపాతం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
గాజా-ఇజ్రాయెల్ మధ్య దాదాపు 22 నెలలుగా యుద్ధం సాగుతోంది. 2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్పై దాడి చేసి కొంత మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఆ నాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఇంకా కొంత మంది వారి దగ్గరే ఉన్నారు. అందరినీ ఒకేసారి విడిచిపెట్టాలని ఇజ్రాయెల్ కోరింది. అందుకు హమాస్ అంగీకరించలేదు. దీంతో ఇజ్రాయెల్ దాడులను కొనసాగించింది.
ప్రస్తుతం గాజాలో దాదాపు 75 శాతం భూభాగం ఐడీఎఫ్ నియంత్రణలో ఉంది. తాజా ప్రణాళిక ప్రకారం.. మిగిలిన భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకోనుంది. అయితే దీన్ని ఐడీఎఫ్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యతో బందీల ప్రాణాలు ప్రమాదంలో పడతాయనే ఆందోళనను వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
DoT New SIM Rules 2026: కొత్త SIM Card తీసుకోవాలనుకుంటున్నారా? DoT కొత్త రూల్స్ ఇవే.. పూర్తి వివరాలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!