తెలంగాణ నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ శుభవార్త అందించింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు 200 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. పంబా వద్ద స్పాట్ బుకింగ్ ద్వారా బస్సులోని భక్తులందరూ ఒకేసారి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునే వెసులుబాటును కూడా కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అలాగే బస్సును ముందుగానే బుక్ చేసుకుంటే గురుస్వామితోపాటు మరో ఆరుగురికి ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుందన్నారు. ప్రత్యేక బస్సులు, ఇతర వివరాల…
కోర్టులో ర్యాపిడోకి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీకి పరువు నష్టం కలిగించే ప్రకటనా చిత్రాలను ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని ర్యాపిడోని కోర్టు ఆదేశించింది. యూట్యూబ్ తన ప్లాట్ఫామ్ నుంచి పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తీసివేయాలని కూడా ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు ప్రాసిక్యూట్ చేయబడతారని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, గతంలో ర్యాపిడో టీఎస్ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని యాడ్ను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ ఆదేశాలను మీరితే ప్రాసిక్యూషన్…
టీఎస్ ఆర్టీసీని తక్కువ చేస్తూ ఇటీవల రాపిడో అనే సంస్థ చేసిన యాడ్ విషయమై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్, రాపిడో సంస్థ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ డిమాండ్ చేశారు. అంతకుడు సెలెబ్రిటీలు కమర్షియల్ యాడ్ లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, డబ్బుల కోసం ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని, ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. తాజాగా మరోమారు…
తెలుగు సినిమా రంగంలో నటుడు ఆర్.నారాయణమూర్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. జన్మించింది ఏపీలోనే అయినా తెలంగాణ జీవన విధానంలోనే ఎక్కువగా ఆయన గడిపారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటలో జన్మించిన ఆర్.నారాయణమూర్తి ఎక్కువగా గ్రామీణుల నేపథ్యంలోనే అనేక సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించారు. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండే ఆయన విప్లవాత్మక సినిమాలు తీయడంలో దిట్ట. ఎక్కువగా కమ్యూనిస్టు భావజాలం ఉన్న నారాయణమూర్తి సోమవారం నాడు పరకాల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దీంతో బస్సులోని కండక్టర్…
మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అనే చందంగా మారింది తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. వేలకోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీలో దుబారా ఖర్చులు తగ్గడం లేదు. సంస్థను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాల్సిన సారథులు, ఉన్నతాధికారులు.. లగ్జరీ కార్ల కోసం ఆర్టీసీపై మరింత భారం వేస్తున్నారు. విమర్శలకు ఆస్కారం కల్పిస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి సారథుల కోసం కొత్త కార్లు? ఆర్టీసీని ఆదరించండి, ఆర్టీసీ బస్సులు ఎక్కండి.. ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోండి.. ప్రభుత్వం, ప్రజా రోడ్డు రవాణా…
టీఎస్ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ పలు ఆదేశాలు జారీ చేశారు. అద్దె బస్సు డ్రైవర్లకు టీఎస్ఆర్టీసీ శిక్షణా కేంద్రాల్లో శిక్షణ తప్పనిసని చేస్తూ చైర్మన్ బాజిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హకీంపేట, వరంగల్లో ఉన్న టీఎస్ఆర్టీసీ శిక్షణాకేంద్రాల్లో శిక్షణ పొందాలన్నారు. అద్దె బస్సుల యజమానులు తమ డ్రైవర్లకు తప్పకుండా శిక్షణ ఇప్పించాలని పేర్కొన్నారు. అద్దె బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా, అధిక వేగంగా బస్సులు నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు…
టీఎస్ఆర్టీసీ కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు వెళుతోంది. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినాటి నుంచి వినూత్న కార్యక్రమాలకు ప్రవేశపెడుతూ ఆర్టీసీ అభివృద్ధికి పాల్పడుతున్నారు. అయితే తాజా మరో కొత్త కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టించి. ఇక నుంచి పెండ్లిలకు బస్సును బుక్ చేసుకుంటే నూతన వధూవరులకు ఆర్టీసీ తరుపున జ్ఞాపికను అందజేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఒక్క రోజే 500 వివాహాల్లో 500 నవ దంపతులకు ఆర్టీసీ తరుపున షీల్డ్ ను ఆర్టీసీ ఉద్యోగులు ప్రధానం చేశారు.…
తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మళ్లీ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ.. దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నారు.. ఇక, నల్గొండ ఆర్టీసీ డిపోల్లో ఆకస్మిక తనిఖీలు చేవారు సజ్జనార్.. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని.. రైతులకు కూడా ఉపయోగపడేలా కార్గో సేవలు అందించనున్నట్టు వెల్లడించారు.. రెండేళ్లుగా 30 శాతం డీజిల్ ధరలు పెరగడంతో…