ఆర్టీసీ చార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన సజ్జనార్.. ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపుపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది… డీజిల్ ధరలు పెరగడం, కరోనా దెబ్బకొట్టడంతో.. చార్జీలు పెంచక తప్పదనే నిర్ణయానికి వచ్చింది టీఎస్ఆర్టీసీ.. అయితే, ఆర్టీసీ చార్జీలు ఎంతమేర పెంచనున్నారు అనేదానిపై క్లారిటీ ఇచ్చారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. డీజిల్ ధరలు పెరిగినప్పుడు మాత్రమే ఆర్టీసీ టిక్కెట్ ధరలు పెంచామని.. గడిచిన 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 1న 20 పైసల మేర చార్జీలు పెంచామని గుర్తుచేసిన ఆయన.. చార్జీలు పెంచినా ఆ లాభాలు ఆర్టీసీకి రాలేదని.. కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ వల్ల రవాణా రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలిందన్న సజ్జనార్.. 251 మంది ఉద్యోగులు కోవిడ్ వల్ల చనిపోయారని తెలిపారు. ఇక, గతంలో లీటర్ డీజిల్ రూ. 68.29 ఉంటే.. అది ఇప్పుడు అనూహ్యంగా పెరిగిపోయిందని.. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఏకంగా రూ. 480 కోట్ల నష్టం వాటిల్లిందని.. రూ.1,440 కోట్లు ఈ సంవత్సరం నష్టాలు ఉన్నాయని తెలిపారు.
Read Also: మన దగ్గరే అనుకుంటే పొరపాటే..! అక్కడ కూడా నేతల తిట్ల పురాణం..
Also Read
ఇక, చార్జీల పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇవ్వాల్సి ఉందన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. 25 పైసలు పల్లె వెలుగుకు, 30 పైసలు ఎక్స్ ప్రెస్లకు, ఇతర సర్వీసులకు పెంచాలని కోరుతున్నామన్న ఆయన.. రోజుకు 14 కోట్ల ఆదాయం వస్తోంది. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారని తెలిపారు. చార్జీలు పెంచితే ఆర్టీసీ గాడిలో పడుతుందని ఆశిస్తున్నామన్న ఆయన.. ఇప్పటికే 525 కొత్త బస్సులు కొనుగోలు చేశాం… ఆర్టీసీలో అనేక మార్పులు తీసుకు వచ్చామని వెల్లడించారు. కాగా, ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినూత్న తరహాలో ఆర్టీసీకి ప్రచారం కల్పిస్తున్నారు.. అంతేకాదు.. ఆ సంస్థను లాభాల బాటలోకి నడిపిస్తున్నారు. ఓవైపు ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందిలో భరోసా కల్పిస్తూనే.. మరోవైపు ప్రయాణికుల్లో నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ.. సమస్యల పరిష్కారానికి పూనుకుంటున్నారు.
తాజావార్తలు
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!