ఆర్టీసీ చార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన సజ్జనార్.. ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపుపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది… డీజిల్ ధరలు పెరగడం, కరోనా దెబ్బకొట్టడంతో.. చార్జీలు పెంచక తప్పదనే నిర్ణయానికి వచ్చింది టీఎస్ఆర్టీసీ.. అయితే, ఆర్టీసీ చార్జీలు ఎంతమేర పెంచనున్నారు అనేదానిపై క్లారిటీ ఇచ్చారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. డీజిల్ ధరలు పెరిగినప్పుడు మాత్రమే ఆర్టీసీ టిక్కెట్ ధరలు పెంచామని.. గడిచిన 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 1న 20 పైసల మేర చార్జీలు పెంచామని గుర్తుచేసిన ఆయన.. చార్జీలు పెంచినా ఆ లాభాలు ఆర్టీసీకి రాలేదని.. కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ వల్ల రవాణా రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలిందన్న సజ్జనార్.. 251 మంది ఉద్యోగులు కోవిడ్ వల్ల చనిపోయారని తెలిపారు. ఇక, గతంలో లీటర్ డీజిల్ రూ. 68.29 ఉంటే.. అది ఇప్పుడు అనూహ్యంగా పెరిగిపోయిందని.. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఏకంగా రూ. 480 కోట్ల నష్టం వాటిల్లిందని.. రూ.1,440 కోట్లు ఈ సంవత్సరం నష్టాలు ఉన్నాయని తెలిపారు.
Read Also: మన దగ్గరే అనుకుంటే పొరపాటే..! అక్కడ కూడా నేతల తిట్ల పురాణం..
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
ఇక, చార్జీల పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇవ్వాల్సి ఉందన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. 25 పైసలు పల్లె వెలుగుకు, 30 పైసలు ఎక్స్ ప్రెస్లకు, ఇతర సర్వీసులకు పెంచాలని కోరుతున్నామన్న ఆయన.. రోజుకు 14 కోట్ల ఆదాయం వస్తోంది. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారని తెలిపారు. చార్జీలు పెంచితే ఆర్టీసీ గాడిలో పడుతుందని ఆశిస్తున్నామన్న ఆయన.. ఇప్పటికే 525 కొత్త బస్సులు కొనుగోలు చేశాం… ఆర్టీసీలో అనేక మార్పులు తీసుకు వచ్చామని వెల్లడించారు. కాగా, ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినూత్న తరహాలో ఆర్టీసీకి ప్రచారం కల్పిస్తున్నారు.. అంతేకాదు.. ఆ సంస్థను లాభాల బాటలోకి నడిపిస్తున్నారు. ఓవైపు ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందిలో భరోసా కల్పిస్తూనే.. మరోవైపు ప్రయాణికుల్లో నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ.. సమస్యల పరిష్కారానికి పూనుకుంటున్నారు.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!