టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ముందస్తు ఎన్నికల గురించి ఈమధ్యే తన జోస్యం చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్. తాజాగా ఆయనకు కోపం వచ్చింది. సొంత పార్టీ నాయకుల నుంచి వచ్చిన కౌంటర్లకు ఎదురు దాడికి దిగారు. ఇక మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ను స్వీకరించారు టీపీసీసీ చీఫ్. చర్చకు రావాలని డిమాండ్ చేశారు. బీహార్ ఐఏఎస్లపై రేవంత్ చేసిన కామెంట్స్కి వీహెచ్, మధు యాష్కీ కౌంటర్ ఎటాక్ చేశారు. అయితే ఐదుగురు ఐఏఎస్…
ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే, ఈసారి గవర్నర్ ప్రసంగం లేకపోవడం వివాదాస్పదం అయింది. దీనిపై గవర్నర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రికి చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కి స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, యాదాద్రి ప్రధానాలయంను సందర్శించి, ప్రధాన ఆలయంలో గల స్వయంభు మూర్తులను దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ తర్వాత ఆలయ పరిసరాల్లో…
వాళ్లంతా అధికారపార్టీని కాదని వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగొచ్చేస్తారని ప్రచారం ఊపందుకుంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యేకు టెన్షన్ పట్టుకుందట. పైకి ధీమాగా కనిపిస్తున్నా.. వారొస్తే తన పరిస్థితి ఏంటనే లెక్కల్లో ఉన్నారట ఎమ్మెల్యే. అది ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మెల్యే సురేందర్లో గుబులు?ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్నట్టుగా రకరకాల ప్రచారాలు షికారు చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ను వీడి వెళ్లిన పలువురు…
ఒకప్పుడు కాంగ్రెస్ గా కంచుకోట అయిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ కార్యాచరణను మొదలు పెట్టారా… అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో ఎంపీ లు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారా.. అందుకే ఇద్దరు ఎంపీలు తమ సొంత నియోజక వర్గంలో కొత్తగా క్యాంపు ఆఫీస్ లను ఏర్పాటు చేశారా? అంటే అవునంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట.…
ఒక్క విగ్రహావిష్కరణ అధికారపక్షం నేతల మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా జరిగిన ఘర్షణ ఖమ్మం జిల్లాలో చినికి చినికి గాలి వానగా మారుతోంది. టీఆర్ఎస్ పార్టీలోని రెండు వర్గాలు బాహా బాహికి గత రాత్రి దిగగా.. ఆ దాడుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో ద్రోహం చేసిన వ్యక్తి రేగా అంటూ మాజీ ఎంఎల్ఎ పాయం ఆరోపిస్తుండగా పొంగులేటి పార్టీ బయటకు వెళ్లి పర్యటనలు చేయాలని రేగా కాంతారావు అంటున్నాడు.…
నేను మేడం సోనియాకు లేఖ రాసిన క్షణం నుండి కాంగ్రెస్ గుంపులో నేను లేను అంటూ సంచలనం రేపారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నాపై కోవర్ట్ అనే నింద వేశారు. ఉద్దేశ పూర్వకంగా ఇలా నిందలు వేస్తున్నారు. నేను భరిస్తూ వుండాలా? తాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్న విషయాన్ని విపులంగా వెల్లడిస్తూ.. ఒక లేఖను ఏఐసీసీకి పంపారు. ఆయన సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మూడు ఆప్షన్లకు అవకాశం ఉంది. కాంగ్రెస్…
తొందరపడి కోయిల ముందే కూసినట్టుగా ఆయన తీరు ఉందా? అక్కడ నుంచి పోటీ చేయాలని తెగ ఉబలాట పడుతున్నారా? ఇది ఆయనకు వచ్చిన ఆలోచనేనా లేక.. పార్టీ చెప్పిందా? అన్నింటికీ సిద్ధపడే మాట్లాడేస్తున్నారా? ఇంతకీ ఎవరా నాయకుడు? గజ్వేల్లో వంటేరు ప్రతాప్రెడ్డి తీరుపై చర్చతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అసెంబ్లీలో 100కు పైగా శాసనసభ్యుల బలం ఉంది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆశావహులు అవకాశం ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్…
అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారసుడికోసం ఆ ఎమ్మెల్యే ప్లాట్ఫారం సిద్ధం చేస్తున్నారు కూడా. ఇంతలో ఏమైందో ఏమో.. అధికారపార్టీకి చెందిన ఇతర నేతలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. బరిలో ఉంటామని సంకేతాలిస్తున్నారట. మరికొందరైతే అనుచరులను బరిలో దింపేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతో నియోజకవర్గంలో అలజడి మొదలైందట. అలంపూర్లో టీఆర్ఎస్ నేతల దూకుడుజోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం పాత, కొత్త నాయకులు…
తెలంగాణ కాంగ్రెస్లో ఫిర్యాదులు కామన్ అయిపోయాయా? రోజుకో కంప్లయింట్ పీసీసీకి తలనొప్పిగా మారిందా? హైకమాండ్కు వివరణ ఇవ్వటానికే టైమ్ సరిపోతోందా? వరస ఫిర్యాదులపై అధిష్ఠానం ఏం చేయబోతుంది? ప్రతి సమస్యపై ఏఐసీసీకి లేఖలు రాసేస్తున్నారా?తెలంగాణ కాంగ్రెస్కి ప్రధాన శత్రువులు ఎక్కడో ఉండరు. సొంత పార్టీలోని నాయకులే.. పార్టీ నేతను కట్టడి చేస్తారు. అనుకున్నది అనుకున్నట్టు అయితే.. ఓకే..! లేదంటే హైకమాండ్కు ఫిర్యాదులు కామన్. ఇది కాంగ్రెస్లో సర్వసాధారణం. అందుకే కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు.…
ఒక్క ఓటమితో పొలిటికల్ తెరపైనుంచి కనుమరుగయ్యారు ఆ మాజీ మంత్రి. ఇప్పుడు భవిష్యత్ ఏంటో తెలియడం లేదట. ఉన్నచోటే అవమానాలను భరించాలా? లేక పాతచోటుకు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు ఆ మాజీ మంత్రి. పొలిటికల్ జంక్షన్లో నిలుచుని అటూ ఇటూ దిక్కులు చూస్తున్న ఆ నాయకుడు ఎవరు? ఏమా కథ? కొల్లాపూర్లో జూపల్లి ఉనికి ప్రమాదంలో పడిందా?జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణలోనూ మంత్రిగా పనిచేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నుంచి వరసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గడిచిన…