Ex Mp Vs Mla Rega Kantharao: కత్తులు దూసుకుంటున్న టీఆర్ఎస్ నేతలు
ఒక్క విగ్రహావిష్కరణ అధికారపక్షం నేతల మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా జరిగిన ఘర్షణ ఖమ్మం జిల్లాలో చినికి చినికి గాలి వానగా మారుతోంది. టీఆర్ఎస్ పార్టీలోని రెండు వర్గాలు బాహా బాహికి గత రాత్రి దిగగా.. ఆ దాడుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో ద్రోహం చేసిన వ్యక్తి రేగా అంటూ మాజీ ఎంఎల్ఎ పాయం ఆరోపిస్తుండగా పొంగులేటి పార్టీ బయటకు వెళ్లి పర్యటనలు చేయాలని రేగా కాంతారావు అంటున్నాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెల మడుగులో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా జరిగిన ఘర్షణలు టీఆర్ఎస్ పార్టీలో గందరగోళానికి తావిస్తున్నాయి. పొంగులేటి తో సహా పొంగులేటి వర్గాన్ని పార్టీ నుంచి పంపించి వేస్తామని రేగా కాంతారావు అంటున్న పరిస్థితికి వచ్చింది. అశ్వాపురం మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని గత రాత్రి ఆవిష్కరించడానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంఎల్ఎ పాయం వెంకటేశ్వర రావు తో పాటుగా మాజీ ఎస్ సి కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్యలు వచ్చారు. అయితే వారు వస్తున్న విషయాన్ని తమకు సమాచారం ఇవ్వలేదని ఎంఎల్ఎ , విప్ , టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అయిన రేగా కాంతారావు ఆగ్రహంగా ఉన్నారు.
Also Read
- MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
- Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
- Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
ప్రోటోకాల్ ప్రకారం తనకు చెప్పలేదని ఆగ్రహంతో ఉన్న రేగా మండలంలో 144 సెక్షన్ ను విధించేలా చేశారు.అయితే పొంగులేటి బృందం మల్లెల మడుగు గ్రామానికి రాకుండా అడ్డుకున్నారు. ఈసందర్బంగా పొంగులేటి బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పిడమర్తి రవి ఉద్యమ కాలంలో చేసినట్లుగానే మోటార్ బైక్ పై పోలీసుల కళ్లు గప్పి వెళ్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జరిగిన ఘర్షణలో రాళ్ల దాడితో పొంగులేటి వర్గానికి చెందిన వారు ఇద్దరు గాయపడ్డారు. దీంతో పోలీసులు పొంగులేటి వర్గానికి చెందిన రెండు సార్లు సత్తుపల్లి నుంచి ఎంఎల్ఎ గా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయిన మాజీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవిపై రెండు కేసులు నమోదు చేశారు.
ఇకపోతే ఈ వ్యవహారం పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. పొంగులేటి వర్గాన్ని దెబ్బ తీయడం కోసం దీనిని వినియోగంచుకోవాలని చూస్తున్నారు. రేగా కాంతారావు ఇది అవకాశంగా తీసుకుని పొంగులేటిని పార్టీ బయటకు పంపాలన్న ఎత్తుగడలు పన్నినట్లుగా తెలుస్తోంది. పొంగులేటి పై రేగా కాంతారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొంగులేటి పార్టీని వదలిపెట్టి, వేరే పార్టీలో చేరి పర్యటనలు చేపట్టాలని అంటున్నాడు. అంతేకాదు ఈ దాడి అంతా అగ్రవర్ణాలు చేసినట్లుగానే ఉందని, ఆర్ ఎస్ ఎస్ ఎటువంటి దాడులు చేస్తుందో అదే తరహా లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి దాడులు చేస్తున్నట్లుగా ఉందన్నారు రేగా కాంతారావు. ఈవ్యవహారాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ఫిర్యాదు చేసి వారిని పార్టీ నుంచి పంపించే చర్యలను తీసుకుంటామని అంటున్నారు.
రేగా కాంతారావు పై మాజీ ఎంఎల్ఎ పాయం వెంకటేశ్వర రావు కూడా మండిపడుతున్నారు. రేగా కాంతారావు కాంగ్రెస్ నుంచి గెలుపొంది ఆ పార్టీ నుంచి వచ్చిన పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లోచేరారని ఆనాడు తెలంగాణ ఉద్యమ ద్రోహిగా రేగా ఉన్నాడని ఆరోపించారు. తమ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని అంటున్నాడు. పినపాక నియోజకవర్గంలో టిఆర్ఎస్ రాజకీయాలు భగ్గు మంటున్నాయి. ఇటు పొంగులేటి వర్గానికి చెందిన పాయం వెంకటేశ్వర్లు రాజకీయాలకు దూరం చేయాలని రేగా కాంతారావు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈనేపద్యంలో పాయంకు మద్దతు ఇస్తున్న పొంగులేటి పై కూడ విరుచుకుపడుతున్నారు. అయితే అటు రేగా కాంతారావు ఇటు పొంగులేటి వర్గీయులు ఇద్దరు వ్యవహారాన్ని కేసీఆర్ కేటీఆర్ వద్ద తేల్చుకుంటామని అంటున్నారు.
మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎం.ఎల్ ఏ పాయం వెంకేటేశ్వర్ రావు, మాజీ ఎస్ సి కార్పొరేషన్ ఛైర్మెన్ పిడమర్తి రవి, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య తో పాటు 15 మంది టీఆరెస్ కార్యకర్తల పై అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. శుక్రవారం అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో జరిగిన గొడవ నేపథ్యంలో రెండు కేసులు నమోదయ్యాయి. పొంగులేటి వర్సెస్ రేగా కాంతారావు వర్గాల మధ్య వివాదం హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్మాన్.. అసలేం జరుగుతోంది?
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో