మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. గత శనివారం ప్రారంభమైన యుద్ధం.. క్రమక్రమంగా తీవ్రస్థాయిలోకి వెళ్లిపోయింది. టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా టెహ్రాన్, బీరూట్లపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది.
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తుండగా.. ఇంకోవైపు ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇంకోవైపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు చమురు సమస్య తలెత్తింది.
మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై అమెరికా దాడి చేసి అత్యున్నత పదవిలో ఉన్న అయతుల్లా ఖమేనీని అంతమొందించింది.
గత నెల 28న అకస్మాత్తుగా ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసి అత్యున్నత పదవిలో ఉన్న అయతుల్లా ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, అధికార పెద్దలను అంతమొందించింది.
Iran Israel War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ వారు(ఇరాన్) మాట్లాడాలనుకుంటున్నారు. నేను ఆలస్యమైందని చెప్పాను. ఇరాన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది’’ అని అన్నారు. ఆదివారం ఇరాన్ నాయకుల అభ్యర్థన మేరకు వారితో మాట్లాడటానికి అంగీకరించానని ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత, దీనికి విరుద్ధంగా తాజా ప్రకటన వచ్చింది.
Israel-Iran War: ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేసి చంపేశాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని అన్ని దేశాలు ఈ యుద్ధంలోకి లాగబడ్డాయి. ఇరాన్ ప్రతీకారంగా యూఏఈ, సౌదీ అరేబియా ,ఖతార్లపై విరుచుకుపడుతోంది. క్షిపణులతో దుబాయ్, అబుదాబి, ఖతార్ సిటీలను టార్గెట్ చేస్తోంది. పెద్ద ఎత్తున ఈ నగరాల్లో శబ్ధాలు వినిపించాయి. దుబాయ్, అబుదాబి ఎయిర్పోర్టుల్ని ఇరాన్ టార్గెట్ చేసింది. ఇదిలా ఉంటే, మరోవైపు ఇజ్రాయిల్ భారీ స్థాయిలో ఇరాన్పై విరుచుకుపడుతోంది. ఆదివారం…
ఆపరేషన్ సిందూర్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నామొన్నటిదాకా భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్.. తాజాగా సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు.
అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని.. గతంలో కంటే బలమైన దేశంగా ఆవిర్భవించిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేశారు.
తాను ఎంత కాలం ఉంటానో తెలియదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఫ్లోరిడాలోని నివాసంలోకి సాయుధ చొరబాటుదారుడు ప్రవేశంపై మాట్లాడారు. అనుమానితుడు తుపాకీ, ఇంధన డబ్బాను తీసుకుని మార్-ఎ-లాగోలోకి అక్రమంగా ప్రవేశించాడని తెలిపారు. చొరబాటుదారుడిని భద్రతా దళాలు కాల్చి చంపాయని పేర్కొన్నారు. షూటర్లు సాధారణ అధ్యక్షుల జోలికి వెళ్లరని.. కేవలం అసాధారణ విజయాలు సాధించే అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్. కెన్నడీ హత్యలే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు.…
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. మంగళవారం ఉదయం నుంచి మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ పరిణామాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఓ వైపు ఏఐ ఆధారిత అంతరాయం, ఇంకోవైపు ట్రంప్ సుంకాల భయం వెంటాడుతున్నాయి.