పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు వారికి ఒప్పించాలిసింది పోయి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులుకు గురి చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గౌరవెల్లి ప్రజలు ప్రాజెక్ట్ కి సహకరిస్తామని చెప్పారని అయినా.. అర్థరాత్రి వందలాది మంది పోలీస్ లు ఇళ్ళ నుండి ఈడ్చుకొచ్చి విచక్షణ రహితంగా కొట్టారని ఆయన మండిపడ్డారు. నిర్వాసితులపై పోలీసుల లాఠీ ఛార్జీ దారుణమని, గతంలో కూడా రాత్రికి రాత్రే వీరిపై దాడి చేసి రోడ్ మీద పడేశారని ఆయన అగ్రహం…
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ, లబ్దిదారులకు దళిత బంధు పంపిణీ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మూడు కోట్లు మంజూరైనట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా గురుకుల పాఠశాలలో సుమారుగా నాలుగు లక్షల మంది పిల్లలు చదువుతున్నారని, 12 వందల కోట్లతో పాఠశాలకు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. విద్య శాఖలో త్వరలో 20 వేల…
ప్రజల్లో చైతన్యం పెంచడానికి వరల్డ్ డోనర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదాన కార్యక్రమాల్లో నలుగురు ఎమ్మెల్యేలు యాక్టివ్గా ఉన్నారన్న మంత్రి హరీష్ రావు.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 18 సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారన్నారు. 1000 యూనిట్స్ తక్కువ కాకుండా అందించారని, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నో యూనిట్స్ బ్లడ్ అందించారన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి 7100 యూనిట్స్ రక్తాన్ని అందించారని,…
సిద్దిపేటలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8సంవత్సరాల ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరాలని చాలామంది ఎదురు చూస్తున్నారని, నల్గొండ జిల్లాకు నేను వెళ్తే నాకు అక్కడ ప్రజలు బ్రహ్మరతం పడితే.. కేసీఆర్ చానెల్, పేపర్ ఖాళీ కుర్చీలు చూపించాయి.. ఆ చానెల్ని ఎవరూ చూడరు వారు తప్ప అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ…
తెలంగాణ గురించి ఆలోచించకుండా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి కలలు కంటున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్. కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ కలలు కంటున్నాడు. కొందరు నిద్రలో కలలు కంటే ఇతను పగటి కలలు కంటున్నాడు. కేసీఆర్ కలలు నెరవేరవు. ఎనిమిదేళ్ళలో నీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది? ఇన్ని రోజులు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త హామీలతో ప్రజల ముందుకి కేసీఆర్ ఎలా వెళ్తాడని ప్రశ్నించారు తరుణ్ చుగ్.…
ఇటీవల మహిళలపై జరుగుతున్న ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై ప్రతిపక్షనేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు కామెంట్లు చేశారు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్నగర్లో అర్ధరాత్రి యువకులు హల్చల్ సృష్టించిన దానిపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే అంటూ ట్వీట్ చేశారు. ఆసిఫ్ నగర్ లో మందుబాబులు పోలీసు వాహనం ఎక్కి వీరంగం వేసిన వీడియోను పోస్ట్ చేశారు.…
దేశంలోని పేద వాడికి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పధకం అమలు చేయలేదని మంత్రి సత్యవతి రాథోడ్ మండి పడ్డారు. మహబూబాబాద్ జిల్లా లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. భారత దేశం అన్ని మతాల కులాల వేదికగా నిలిచిందన్నారు. భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ దేశ సంపద అంతయు కొంతమంది చేతుల్లో పెడుతున్నారని మండి పడ్డారు.…
రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఓవైపు థర్డ్ ఫ్రంట్, కొత్త పార్టీ ఏర్పాటు వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తుంటే.. మరోవైపు.. ఎన్డీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో పడిపోయారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దీనికోసం ఈ నెల 15న ఢిల్లీ వేదికగా కీలక సమావేశం నిర్వహించనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని విపక్షాలకు పిలుపునిచ్చిన దీదీ.. తాను ఏర్పాటు చేసే సమావేశానికి రావాల్సిందిగా 22…
అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూపల్లి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి… హస్తానికి హ్యాండిచ్చి… కారు ఎక్కేశారు. దీంత కొల్లాపూర్ టిఆర్ఎస్లో అగ్గి రాజుకుంది. తాజా, మాజీ…
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు మన బడికి కేంద్రం నిధులు ఇచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారని, కార్యక్రమానికి రూ. 2700కోట్లు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన పైసలు ఎక్కడ విడ్త్రా చేసుకోవాలో బండి సంజయ్ చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఒక పక్క టెట్ వాయిదా వేయాలంటూనే మరో 20వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటున్నారని, బండి సంజయ్ బాధ్యతగా…