మీడియా ముందు బాలయ్య.. అందరి చూపు ఆ చేతిపైనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ నేడు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ఘటనపై స్పందించిన విషయం తెలిసిందే. తమ కుటుంబంపై, ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. అయితే ఆ మీడియా సమావేశంలో అందరి కళ్ళు బాలకృష్ణ ఎడమ చేతి మీదనే ఉన్నాయి.. ఆయన చేతికి కట్టు కట్టుకొని కనిపించారు. దీంతో బాలయ్యకు ఏమైంది..? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలయ్య.. అక్టోబర్ 31న బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం విదితమే.. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన బాలయ్య.. సర్జరీ తరువాత మొదటిసారి నేడు మీడియా ముందుకు వచ్చారు.
ఇటీవల భుజానికి ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో చేయి కదలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకొంటున్నారు. ఇక ఈ పరిస్థితిలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో కూడా పాల్గొనడం లేదని తెలుస్తోంది. అందుకే ఆహా వారు కొద్దిగా ఈ షోకి బ్రేక్ ఇచ్చారని సమాచారం. ముందుగానే మూడు ఎపిసోడ్స్ ప్లాన్ చేశారని , నెక్స్ట్ ఎపిసోడ్ త్వరలోనే ఉంటుందని కొంతమంది అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలి.
Also Read
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!