హాస్య నటుడు సత్య హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’. అర్జావీ రాజ్ కథానాయికగా నటించింది. యువ నటుడు సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ఆగస్టు సోని లివ్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. లాక్డౌన్ ఇతివృత్తంగా సాగే కథతో వస్తుంది ఈ చిత్రం.. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథ వినోదాత్మకంగా రానుంది. ఆనంది ఆర్ట్స్ సోల్జర్స్ ఫ్యాక్టరీ వెంకటాద్రి టాకీస్ సమర్పణలో…
గత నెలాఖరులో సినిమా థియేటర్లను తెరచిన దగ్గర నుండి స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఇది సినిమాల విడుదలకు అచ్చి వచ్చే సీజన్ ఎంత మాత్రం కాదు. అయినా… సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పెద్ద సినిమాలు వస్తే… తమకు చోటు దక్కదనే భయంతో చిన్న చిత్రాల నిర్మాతలంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. అలా జూలై చివరి వారం ఐదు సినిమాలు విడుదలైతే… ఈ నెల ప్రథమార్ధంలో ఏకంగా 15 సినిమాలు విడుదలయ్యాయి. ఇంతవరకూ ‘తిమ్మరుసు,…
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ‘మా’ ఎన్నికలపై తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘మా’ కు శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం లేదని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డాడు. ‘మా’ అసోసియేషన్ లో సుమారు 900 మందిలో చాలా వరకూ దారిద్యరేఖకు దిగువన ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఎంతో మంది కష్టాలు పడుతున్నారు. నా ఉద్దేశం ప్రకారం, బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్…
బుల్లితెర బ్యూటీ, యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం రేపు విడుదల కానుంది. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సింగర్ మనో, రాజా రవీంద్ర అంకుల్స్ పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినిమా విడుదల నిలిపివేయాలని తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శులు కార్యదర్శి రత్నా డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ మహిళలను కించ పరిచే సన్నివేశాలున్నాయని…
నరేశ్, ఆలీతో పాటు మెట్రోట్రైన్ ముఖ్యభూమిక పోషించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. గతేడాది నెట్ఫ్లిక్స్లో విడుదలై సంచలన విజయంగా నమోదైన మలయాళ చిత్రం ‘వికృతి’కి ఇది రీమేక్. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. సంగీత దర్శకుడు…
బ్యూటీ మేఘా ఆకాష్ కు మంచి అవకాశాలే వస్తున్న సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’.. ఆమె ప్రేమకై తపించే పాత్రల్లో అరుణ్ ఆదిత్.. అర్జున్ సోమయాజుల నటించారు. ఈ చిత్రాన్ని ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించగా.. డైరెక్టర్ సుశాంత్ రెడ్డి రూపొందించారు. కాగా, ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.. తాజా అప్డేట్ మేరకు ‘డియర్ మేఘ’…
యాక్టింగ్, డైలాగ్, డాన్సుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గూర్చి ఎంత చెప్పిన తక్కువే.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న తారక్ కు ఇండస్ట్రీలోను అభిమానులు ఉన్నారు. తాజాగా హీరో శ్రీవిష్ణు ఎన్టీఆర్ ను ‘యాక్టింగ్ కింగ్’ అంటూ అభినందించారు. ప్రస్తుతం శ్రీ విష్ణు నటిస్తున్న ‘రాజ రాజ చోర’ చిత్రం ఈ నెల 19న థియేటర్లో విడుదలవుతోంది. ఈ సందర్బంగా శ్రీవిష్ణు ‘చోరుడు తో చాట్’ అంటూ ట్విట్టర్ ద్వారా అందుబాటులోకి వచ్చారు.…
అక్కినేని నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీ విడుదల తేదీని ప్రకటించగానే… నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీశ్’ మూవీ రిలీజ్ పై తన మనసులోని మాటను బయట పెట్టాడు. ‘టక్ జగదీశ్’ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోందని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా, తాను మరోసారి క్రాస్ రోడ్స్ లో నిలబడినట్టు అయ్యిందనే ఆవేదనను వ్యక్తం చేశాడు. ఓ సినీ అభిమానిగా అందరితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే తనకు…
ఇప్పటికే మన స్టార్ హీరోలకు కావాల్సినన్ని కార్లు గ్యారేజ్ లో వున్నా, మార్కెట్ లో మరో మోడల్స్ మన హీరోలకు నచ్చితే వారి గ్యారేజ్ లో చేరాల్సిందే.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోజు పడి తీసుకున్న కారు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఆ కారు ఫీచర్లు కూడా అదరగొట్టేశాయి. ‘లాంబోర్గిన ఉరస్ గ్రాఫిటే క్యాప్సుల్’ మోడల్ కారు ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ దగ్గర మాత్రమే వుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఉన్న…
ఈ యేడాది ఏప్రిల్ 9న విడుదలైన మలయాళ చిత్రం ‘నాయత్తు’ తెలుగు రీమేక్ పై చాలామంది కన్నేశారు. అయితే దాని పునర్ నిర్మాణ హక్కుల్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తెలుగువారికి నచ్చుతుందనేది అల్లు అరవింద్ నమ్మకం. విశేషం ఏమంటే ఇందులో ఓ కీలక పాత్రకు రావు రమేశ్ ను ఎంపిక చేశారు. మూవీ కథ ఆయన చుట్టూనే తిరుగుతుండటంతో బిజీ ఆర్టిస్ట్ అయిన రావు రమేశ్…