టీటీడీ ఉన్నాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్త వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. సమీక్షలో టీటీడీ ఈవోపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. అజాగ్రత్తగా ఉండడం వల్లే ఇంతటి దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని ప్రక్షాళన చేస్తానన్న నమ్మకంతోనే ప్రజలు మాకు ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు..
నిన్న రాత్రి బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో, కొద్దిసేపటి కిందట ఆ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రమాదం జరిగిన తీరును, కారణాలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలను అడిగి తెలుసుకున్నారు పవన్ కల్యాణ్..
తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోపై సీరియస్ అయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, తొక్కిసలాట జరిగే ప్రమాదముందని తెలిసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని ప్రశ్నించారు. మీ ప్లానింగ్ ఏంటి.. భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని ముఖ్యమంత్రి నిలదీశారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. సీఎం చంద్రబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మొత్తం ఘటన స్థలం అంత తిరుగుతూ అధికారులను ఆరా తీశారు. అసలు తొక్కిసలాటలు అంటే ఏంటి? దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఘటనల గురించి పూర్తిగా తెలుసుకుందాం… తొక్కిసలాటలు అంటే అస్తవ్యస్తంగా ఉంటాయి. ఎక్కువ మంది జనాలు ఒక చోట ఉన్నప్పుడు ఆందోళనకు…
తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. 40 మందికి పైగా క్షతగాత్రులు పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వారిని ఇప్పటికే పలువురు మంత్రులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదం జరిగిన బైరాగిపల్లె రామానాయుడు స్కూల్, పద్మావతి పార్క్కు చేరుకున్నారు.
Tirupati Stampede Live Updates: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.
తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ఆరుగురు భక్తులు చనిపోయారు.మరికొందరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు... అసలు ఏ సమయానికి ఏం జరిగింది. ఎలా జరిగింది... రెప్పపాటులో అంత ఘోరం ఎలా జరిగిపోయింది. ఘటన గురించి పూర్తిగా తెలుసుకుందాం..
ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకరమన్నారు. మృతుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చారు. "చిన్న చిన్న దెబ్బలు తగిలిన అందరూ కోలుకుంటున్నారు.. ఒక వ్యక్తి కి ఫాక్చర్ గాయాలు ఉన్నాయి.. తొక్కిసలాట లో ఐదుగురు చనిపోయారు.. క్యూ లైన్ లో అస్వస్థత కు గురై ఒకరు చనిపోయారు..
తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం చూశామని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు అసమర్థత ఈ ఘటనతో స్పష్టమైందని విమర్శిచారు.. ఘటనకు కారణమెవరో కనుక్కోకుండా నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.. అధికారులను, టీటీడీ బోర్డును ఎవరు పెట్టారని ప్రశ్నించారు.. భక్తులకు సర్వీస్ చేయాలన్న ఉద్దేశ్యం ఎవరికి లేదన్నారు.. అధికారులు చంద్రబాబు దగ్గర భజన చేస్తూ తిరుగుతూ భక్తులను గాలికి వదిలేశారని విమర్శించారు.. గత ఏడాది వైసీపీ హయాంలో ఎలా చేశామో అందరూ చూశారన్నారు.…
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది.