CM Chandrababu: ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఫైర్..
- అధికారులపై సీఎం ఫైర్
- అధికారులు ఏం చేశారని ప్రశ్న
- సీఎంకు సమాధానం చెప్పిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. 40 మందికి పైగా క్షతగాత్రులు పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వారిని ఇప్పటికే పలువురు మంత్రులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదం జరిగిన బైరాగిపల్లె రామానాయుడు స్కూల్, పద్మావతి పార్క్కు చేరుకున్నారు. అధికారులు సీఎంకు ఘటన ఎలా జరిగింది? అనే అంశంపై వివరణ ఇచ్చారు. భద్రత ఏర్పాట్లు, తొక్కిసలాట గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్ ఎక్కడ పెట్టారని ఆరా తీశారు. అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు.
READ MORE: Tirupati stampede: తిరుపతిలో రాత్రి ఏం జరిగింది? తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణాలు ఏంటి?
Also Read
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన వారిని వదిలే సమస్యే లేదని హెచ్చరించారు. టీటీడీ అధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కొత్త ప్రదేశంలో పంపిణీకి సిద్ధమైనప్పుడు అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. పలువురు అధికారులు సీఎంకి సమాధానం చెప్పారు. డిఎస్పీ వల్లే ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. భక్తులు మొదట ప్రశాంతంగానే ఉన్నారని.. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా డిఎస్పీ గేటు తెరవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు సమధానమిచ్చారు. అనంతరం సీఎం బాధితులను కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లారు.
READ MORE:PM Modi: మానవుడి భవిష్యత్త్ యుద్ధంలో లేదు.. బుద్ధుడిలో ఉందంటూ రష్యా, ఇజ్రాయెల్లకు మోడీ చురకలు!
వాళ్ళు ఎవరో పెట్టారని మీరు కూడా అదే ఫార్ములాను పాటించడమేంటని సీఎం ఫైర్ అయ్యారు. “ఘటన జరకముందు చేస్తే అడ్మినిస్ట్రేషన్… జరిగాక చేస్తే గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా అవుతుంది? టెక్నాలజీని వాడుకుని టికెట్లు ఇవ్వడం తెలియదా? (జేఈవో గౌతమీపై సిరియస్) జేఈవోగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా? భక్తుల రద్దీనీ దృష్టిలో పెట్టుకుని టికెట్లు ఇవ్వాలని తెలియదా? భక్తుల నుంచి ఫిర్యాదు వస్తే మీరేం చేశారు? ఘటన తరువాత మీరు చేసింది ఏంటి? కనీసం వాట్స్ గ్రూప్ ద్వారా మీ సిబ్బంది అదేశాలు ఇవ్వలేరా?” అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్బ్యాక్ అవుతాడా?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!