CM Chandrababu: ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఫైర్..
- అధికారులపై సీఎం ఫైర్
- అధికారులు ఏం చేశారని ప్రశ్న
- సీఎంకు సమాధానం చెప్పిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. 40 మందికి పైగా క్షతగాత్రులు పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వారిని ఇప్పటికే పలువురు మంత్రులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదం జరిగిన బైరాగిపల్లె రామానాయుడు స్కూల్, పద్మావతి పార్క్కు చేరుకున్నారు. అధికారులు సీఎంకు ఘటన ఎలా జరిగింది? అనే అంశంపై వివరణ ఇచ్చారు. భద్రత ఏర్పాట్లు, తొక్కిసలాట గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్ ఎక్కడ పెట్టారని ఆరా తీశారు. అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు.
READ MORE: Tirupati stampede: తిరుపతిలో రాత్రి ఏం జరిగింది? తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణాలు ఏంటి?
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన వారిని వదిలే సమస్యే లేదని హెచ్చరించారు. టీటీడీ అధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కొత్త ప్రదేశంలో పంపిణీకి సిద్ధమైనప్పుడు అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. పలువురు అధికారులు సీఎంకి సమాధానం చెప్పారు. డిఎస్పీ వల్లే ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. భక్తులు మొదట ప్రశాంతంగానే ఉన్నారని.. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా డిఎస్పీ గేటు తెరవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు సమధానమిచ్చారు. అనంతరం సీఎం బాధితులను కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లారు.
READ MORE:PM Modi: మానవుడి భవిష్యత్త్ యుద్ధంలో లేదు.. బుద్ధుడిలో ఉందంటూ రష్యా, ఇజ్రాయెల్లకు మోడీ చురకలు!
వాళ్ళు ఎవరో పెట్టారని మీరు కూడా అదే ఫార్ములాను పాటించడమేంటని సీఎం ఫైర్ అయ్యారు. “ఘటన జరకముందు చేస్తే అడ్మినిస్ట్రేషన్… జరిగాక చేస్తే గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా అవుతుంది? టెక్నాలజీని వాడుకుని టికెట్లు ఇవ్వడం తెలియదా? (జేఈవో గౌతమీపై సిరియస్) జేఈవోగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా? భక్తుల రద్దీనీ దృష్టిలో పెట్టుకుని టికెట్లు ఇవ్వాలని తెలియదా? భక్తుల నుంచి ఫిర్యాదు వస్తే మీరేం చేశారు? ఘటన తరువాత మీరు చేసింది ఏంటి? కనీసం వాట్స్ గ్రూప్ ద్వారా మీ సిబ్బంది అదేశాలు ఇవ్వలేరా?” అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!