CM Chandrababu: ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఫైర్..
- అధికారులపై సీఎం ఫైర్
- అధికారులు ఏం చేశారని ప్రశ్న
- సీఎంకు సమాధానం చెప్పిన అధికారులు
తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. 40 మందికి పైగా క్షతగాత్రులు పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వారిని ఇప్పటికే పలువురు మంత్రులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదం జరిగిన బైరాగిపల్లె రామానాయుడు స్కూల్, పద్మావతి పార్క్కు చేరుకున్నారు. అధికారులు సీఎంకు ఘటన ఎలా జరిగింది? అనే అంశంపై వివరణ ఇచ్చారు. భద్రత ఏర్పాట్లు, తొక్కిసలాట గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్ ఎక్కడ పెట్టారని ఆరా తీశారు. అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు.
READ MORE: Tirupati stampede: తిరుపతిలో రాత్రి ఏం జరిగింది? తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణాలు ఏంటి?
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన వారిని వదిలే సమస్యే లేదని హెచ్చరించారు. టీటీడీ అధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కొత్త ప్రదేశంలో పంపిణీకి సిద్ధమైనప్పుడు అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. పలువురు అధికారులు సీఎంకి సమాధానం చెప్పారు. డిఎస్పీ వల్లే ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. భక్తులు మొదట ప్రశాంతంగానే ఉన్నారని.. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా డిఎస్పీ గేటు తెరవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు సమధానమిచ్చారు. అనంతరం సీఎం బాధితులను కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లారు.
READ MORE:PM Modi: మానవుడి భవిష్యత్త్ యుద్ధంలో లేదు.. బుద్ధుడిలో ఉందంటూ రష్యా, ఇజ్రాయెల్లకు మోడీ చురకలు!
వాళ్ళు ఎవరో పెట్టారని మీరు కూడా అదే ఫార్ములాను పాటించడమేంటని సీఎం ఫైర్ అయ్యారు. “ఘటన జరకముందు చేస్తే అడ్మినిస్ట్రేషన్… జరిగాక చేస్తే గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా అవుతుంది? టెక్నాలజీని వాడుకుని టికెట్లు ఇవ్వడం తెలియదా? (జేఈవో గౌతమీపై సిరియస్) జేఈవోగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా? భక్తుల రద్దీనీ దృష్టిలో పెట్టుకుని టికెట్లు ఇవ్వాలని తెలియదా? భక్తుల నుంచి ఫిర్యాదు వస్తే మీరేం చేశారు? ఘటన తరువాత మీరు చేసింది ఏంటి? కనీసం వాట్స్ గ్రూప్ ద్వారా మీ సిబ్బంది అదేశాలు ఇవ్వలేరా?” అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!