Drunk Violence In Tirupati: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మందు బాబులు బరితెగించారు. కేశవాయన గుంటలో నడి రోడ్డుపై కారు నిలిపి, బహిరంగంగా మద్యం సేవిస్తూ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారు. అదే సమయంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తున్న ఓ రోగి కుటుంబం, కారును పక్కకు తీయాలని కోరినందుకు వారిపై బూతు పురాణం ఎత్తుకున్నాడు.
Kidnap At Tirupati: తిరుపతి నగరంలో 13 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. తమిళనాడు నుండి వచ్చి నాలుగో భర్తతో కలిసి జీవనం సాగిస్తున్న మహిళ ఇంటి పక్కనే ఉంటున్న చిన్నారిని కిడ్నాప్ చేసింది. తిరుపతికి చెందిన మునిరెడ్డి స్థానిక చింతలచేను రోడ్డులో చిత్తు పేపర్లు, ప్లాస్టిక్ నీళ్ల సీసాలు సేకరించే దుకాణం నడుపుతున్నారు. వాటిని తీసుకొచ్చే వ్యక్తుల కోసం పక్కనే గదులు అందుబాటులో ఉంచారు. Union Budget 2026: భార్యాభర్తలకు నిర్మలమ్మ గుడ్న్యూస్.. డబ్బును…
Tirupati Crime: తిరుపతి సమీపంలోని దామినేడులోని ఓ ఇంట్లో కుళ్లిన మూడు మృతదేహాలు కలకలం రేపాయి. తమిళనాడు రాష్ట్రం, గుడియాత్తంకు చెందిన సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీశ్ మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితం ఇరువురు కూడా వివాహేతర సంబంధంతో సొంత ఊరిని వదిలి తిరుపతికి వచ్చి ఇక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. ఏం జరిగిందో ఏమో.. కానీ, గత నెల 22వ తేదీ నుండి ఇంటి నుండి బయటకు రాలేదు.. ఇంటి…
తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి. స్థానిక ఇంద్ర ప్రియదర్శిని కూరగాయలు మార్కెట్లో మత్తు ఎక్కించే ఇంజక్షన్లు వీడియో వైరల్ అవుతోంది. ఇంజక్షన్ లను తీసుకునే సమయంలో యువకులు వీడియో తీశారు. కూరగాయల మార్కెట్ లో తరచూ మత్తులో ఉంటూ యువకులు హల్ చల్ సృష్టిస్తున్నారు. తిరుపతి నగరంలో విచ్చలవిడిగా మత్తు పదార్థాల వినియోగం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. యువత స్వయంగా మత్తు ఇంజక్షన్లు వేసుకుంటున్నారని వెల్లడిస్తున్నారు.
హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరు అరెస్టు చేశారు అలిపిరి పోలీసులు. ఈనెల 25వ తేదీన తిరుపతి ఎన్జీవో కాలనీలో వెంకట శివారెడ్డి అనే వ్యక్తి పై హత్యాయత్నం జరిగింది.