Love Turns Tragedy: పెళ్లయ్యాక అతనితో ఎఫైర్.. లాడ్జిలో షాకింగ్ దృశ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lovers Commits Suicide In TIrupati Lodge: ప్రేమించుకున్న ఓ జంటను కులం విడదీసింది కానీ, వారి మనసుల్ని మాత్రం వేరు చేయలేకపోయింది. వారి మధ్య ప్రేమను చెరపలేకపోయింది. అందుకే.. వేర్వేరుగా ఉండలేక, కలిసి చనిపోవాలని ఆ జంట నిర్ణయించుకుంది. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన అనూష(21)కు రెండేళ్ల క్రితం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గుడ్ల పోసిబాబుతో వివాహంతో జరిగింది. ఈ జంట కొవ్వూరులో నివాసం ఉంటోంది.
అయితే.. అనూష పెళ్లి కాకముందే షాపూర్ ప్రాంతానికి చెందిన కృష్ణారావుతో ప్రేమ వ్యవహారం నడిపింది. వీళ్లు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుని, తమ పేరెంట్స్కి విషయం చెప్పారు. కానీ, కులాలు వేరు కావడంతో పెద్దలు వారి పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే అనూషకు రెండేళ్ల క్రితం పోసిబాబుకి వివాహం జరిపించారు. పెద్దల ఒత్తిడితో అనూష అయిష్టంగానే ఆ పెళ్లి చేసుకుంది. కానీ, కృష్ణారావుని మరువలేకపోయింది. అందుకే, పెళ్ళైనా అతనితో అనుబంధం కొనసాగించింది. కానీ, ఎన్నాళ్లిలా కలుసుకుంటాం? జీవితాంతం కలిసి ఉండలేం కదా! అని ఆ జంట అనుకుంది. దీంతో.. చావులోనైనా కలిసుందామని నిర్ణయించుకుంది.
Also Read
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- CM Chandrababu: 'స్వర్ణ కుప్పం విజన్ 2029'కు శ్రీకారం.. కుప్పం రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్పై సీఎం సమీక్ష
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
- Kandula Durgesh: "మీ అక్రమ సంబంధం నాకు తెలుసు".. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
ఈ నేపథ్యంలోనే ఈనెల 5వ తేదీన ఇద్దరూ కలిసి తిరుపతికి వెళ్లారు. అక్కడ త్రిలోక్ లాడ్జిలో రూమ్ బుక్ చేసుకున్నారు. ముందుగా అనుకున్నట్టుగానే.. అక్కడే ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం వాళ్లు ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో.. లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అటు.. ఈనెల 5న తన భార్య కనిపించడం లేదని పోసిబాబు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే తిరుపతిలోని లాడ్జిలో అనూష ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకొని, విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!