Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. మూడు రోజులు పాటు సర్వదర్శనం టోకెన్లు రద్దు…!
- తిరుమలలో భక్తుల రద్దీ
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండాయి
- టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం
- నేడు ఏప్రిల్ నెల దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమలలో భక్తుల సందడి కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్ లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక నేడు ఏప్రిల్ నెల దర్శన టికెట్ల విడుదల కానున్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను ఇవాళ ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
IND vs NZ T20: అభిషేక్ శర్మ వన్ మ్యాన్ షో.. కివిస్ పై టీమిండియా భారీ విజయం.!
Also Read
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
- TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల కానున్నాయి. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. నిన్న (జనవరి 21) శ్రీవారిని మొత్తం 74,056 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,517 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదే రోజున హుండీ ద్వారా రూ. 3.98 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.
Amruta: నా భర్త పిక్నిక్ కోసం దావోస్ వెళ్లలేదు.. విపక్షాలకు సీఎం భార్య స్ట్రాంగ్ కౌంటర్
ఈ నెల 25వ తేదీన తిరుమలలో శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. రథసప్తమి నేపథ్యంలో ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లను రద్దు చేశారు. అలాగే 25వ తేదీన ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలు, దర్శన ప్రణాళికలను ముందుగానే సర్దుబాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!