TTD Laddu Row : తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు..?
- తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో SIT కీలక ఘట్టం
- 36 మంది నిందితులు.. డైరీలతో పాటు టీటీడీ ఉద్యోగులు కూడా
- పామాయిల్ మిశ్రమంతో 20 కోట్ల లడ్డూల తయారీ
- కోర్టు ఆదేశాలపై మరిన్ని అరెస్టుల అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే సంచలన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక ఘట్టానికి చేరుకుంది. సుమారు 600 పేజీల సుదీర్ఘమైన తుది ఛార్జ్షీట్ను సిట్ అధికారులు నెల్లూరులోని ఏసీబీ కోర్టులో సీల్డ్ కవర్లో సమర్పించారు. ఈ సమగ్ర నివేదికలో కల్తీ నెయ్యి సరఫరా వెనుక ఉన్న భారీ కుంభకోణాన్ని, నిందితుల పాత్రను ఆధారాలతో సహా పొందుపరిచారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చగా, ఇందులో డైరీ నిర్వాహకులతో పాటు టీటీడీ ఉద్యోగులు , డైరీ నిపుణులు కూడా ఉండటం గమనార్హం. గతంలో దాఖలు చేసిన ఛార్జ్షీట్లకు అదనంగా, లోతైన విచారణ తర్వాత మరికొందరి పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు సమాచారం.
Divi Vadthya : పెళ్లి.. విడాకుల కంటే అదే బెటర్.. దివి షాకింగ్ కామెంట్స్!
Also Read
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- OTR : ఉమ్మడి శ్రీకాకుళం రాజాం రాజకీయాల్లో హాట్ టర్న్! వైసీపీ పరిస్థితి ఏంటి?
సిబిఐ నేతృత్వంలో జరిగిన ఈ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా బోలే బాబా డైరీకి అసలు ఆవులే లేవని, బయట నుండి పాలు కూడా సేకరించకుండానే నెయ్యిని ఎలా ఉత్పత్తి చేశారనే అంశంపై సిట్ ఆధారాలను సేకరించింది. పామాయిల్లో వివిధ రకాల రసాయనాలు కలిపి నెయ్యిని పోలిన మిశ్రమాన్ని తయారు చేసి, దానిని ఏఆర్ డైరీ , వైష్ణవి డైరీల ద్వారా తిరుమలకు సరఫరా చేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. దాదాపు 68 లక్షల కిలోల ఈ కల్తీ మిశ్రమంతో సుమారు 20 కోట్ల లడ్డూలను తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ సరఫరాకు సంబంధించి వివిధ డైరీలకు సుమారు 251 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరిగినట్లు ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ భారీ కుంభకోణంపై విచారణలో భాగంగా టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి వంటి కీలక వ్యక్తులను కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. రాజకీయంగా , ఆధ్యాత్మికంగా దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో, సిట్ సమర్పించిన ఈ 600 పేజీల ఛార్జ్షీట్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. కోర్టు ఈ నివేదికను పరిశీలించిన తర్వాత వెలువడే ఆదేశాల ఆధారంగా మరిన్ని అరెస్టులు , కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అటు ఏసీబీ కోర్టు, ఇటు సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తాయన్న దానిపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Divi Vadthya : పెళ్లి.. విడాకుల కంటే అదే బెటర్.. దివి షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
-
Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!