TTD Laddu Row : తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు..?
- తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో SIT కీలక ఘట్టం
- 36 మంది నిందితులు.. డైరీలతో పాటు టీటీడీ ఉద్యోగులు కూడా
- పామాయిల్ మిశ్రమంతో 20 కోట్ల లడ్డూల తయారీ
- కోర్టు ఆదేశాలపై మరిన్ని అరెస్టుల అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే సంచలన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక ఘట్టానికి చేరుకుంది. సుమారు 600 పేజీల సుదీర్ఘమైన తుది ఛార్జ్షీట్ను సిట్ అధికారులు నెల్లూరులోని ఏసీబీ కోర్టులో సీల్డ్ కవర్లో సమర్పించారు. ఈ సమగ్ర నివేదికలో కల్తీ నెయ్యి సరఫరా వెనుక ఉన్న భారీ కుంభకోణాన్ని, నిందితుల పాత్రను ఆధారాలతో సహా పొందుపరిచారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చగా, ఇందులో డైరీ నిర్వాహకులతో పాటు టీటీడీ ఉద్యోగులు , డైరీ నిపుణులు కూడా ఉండటం గమనార్హం. గతంలో దాఖలు చేసిన ఛార్జ్షీట్లకు అదనంగా, లోతైన విచారణ తర్వాత మరికొందరి పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు సమాచారం.
Divi Vadthya : పెళ్లి.. విడాకుల కంటే అదే బెటర్.. దివి షాకింగ్ కామెంట్స్!
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
సిబిఐ నేతృత్వంలో జరిగిన ఈ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా బోలే బాబా డైరీకి అసలు ఆవులే లేవని, బయట నుండి పాలు కూడా సేకరించకుండానే నెయ్యిని ఎలా ఉత్పత్తి చేశారనే అంశంపై సిట్ ఆధారాలను సేకరించింది. పామాయిల్లో వివిధ రకాల రసాయనాలు కలిపి నెయ్యిని పోలిన మిశ్రమాన్ని తయారు చేసి, దానిని ఏఆర్ డైరీ , వైష్ణవి డైరీల ద్వారా తిరుమలకు సరఫరా చేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. దాదాపు 68 లక్షల కిలోల ఈ కల్తీ మిశ్రమంతో సుమారు 20 కోట్ల లడ్డూలను తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ సరఫరాకు సంబంధించి వివిధ డైరీలకు సుమారు 251 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరిగినట్లు ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ భారీ కుంభకోణంపై విచారణలో భాగంగా టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి వంటి కీలక వ్యక్తులను కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. రాజకీయంగా , ఆధ్యాత్మికంగా దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో, సిట్ సమర్పించిన ఈ 600 పేజీల ఛార్జ్షీట్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. కోర్టు ఈ నివేదికను పరిశీలించిన తర్వాత వెలువడే ఆదేశాల ఆధారంగా మరిన్ని అరెస్టులు , కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అటు ఏసీబీ కోర్టు, ఇటు సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తాయన్న దానిపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Divi Vadthya : పెళ్లి.. విడాకుల కంటే అదే బెటర్.. దివి షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!