Delhi Car Blast: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ మొహమ్మద్ గురించి ఓ ప్రధాన అంశం వెల్లడైంది. ఉమర్ పేలుడుకు ముందు ఓల్డ్ ఢిల్లీలోని ఒక మసీదుకు వెళ్ళాడు. ఎర్రకోట వైపు వెళ్ళే ముందు 10 నిమిషాలకు పైగా అక్కడే గడిపాడు. ఇది ఫైజ్-ఎ-ఇలాహి మసీదు. తుర్క్మాన్ గేట్ ఎదురుగా రాంలీలా మైదాన్ మూలలో ఉంది. నిజాముద్దీన్ మర్కజ్ లాగానే ఈ మసీదులో తబ్లిగీ జమాత్ జరుగుతుందని చెబుతున్నారు.…
Pahalgam Attack: కశ్మీర్ లోయలోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి వెనుక కుట్ర నెమ్మదిగా బయటపడుతోంది. ఉగ్రవాదులతో నాలుగుసార్లు సమావేశమై, వారికి లాజిస్టికల్ మద్దతును అందించి, మొబైల్ ఫోన్ ఛార్జర్లను సరఫరా చేసిన ఓ వ్యక్తిని జమ్మూ కశ్మీర్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. నిందితుడి పేరు 26 ఏళ్ల మొహమ్మద్ యూసుఫ్ కటారి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రకారం.. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు సులేమాన్ అలియాస్ ఆసిఫ్, జిబ్రాన్, హంజా…
Terror Activity : మొన్న విజయనగరం, నిన్న రాయచోటి.. నేడు ధర్మవరం.. ఉగ్రవాదుల కదలికలు ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతున్నాయి. సాధారణ జనంలో కలిసి పోయి ఉండి.. నిత్యం దాయాది దేశం పాకిస్తాన్లోని ముష్కర సంస్థలతో కొంత మంది సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి వ్యక్తిని ధర్మవరంలో కౌంటర్ ఇంటెలిజెన్స్, ఐబీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ముష్కర మూకలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నాడు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.…
Supreme Court: నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై విధించిన నిషేధాన్ని ఐదేళ్ల పాటు పొడిగించే ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాకలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 3(1) కింద సిమిని "చట్టవిరుద్ధ సంఘం"గా ప్రకటిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ సిమి కి చెందిన మాజీ సభ్యుడు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులపై కాల్పులు జరపగా.. మొత్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని భారత్తో పాటు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. కానీ.. ఈ దాడిపై అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ పాకిస్థాన్కు మద్దతు పలికాడు. ప్రస్తుత పెహల్గామ్ ఉగ్రదాడి, అంతకుముందు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి…
Pahalgam Attack : పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో తెలంగాణలో హై అలెర్ట్ ప్రకటించబడింది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల అవకాశాలపై వచ్చిన విశ్వసనీయ సమాచారంతో రాష్ట్ర పోలీసు శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని హెచ్ఐసీసీ, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో కఠినమైన భద్రతా చర్యలు చేపట్టబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి (CS) శాంతికుమారి, రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అలెర్ట్ చేయగా, డీజీపీ అనjani కుమార్ రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు…
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడికి గురైన బాధితులు తాజాగా ఎన్టీవీతో సంభాషించారు. 2017లో కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర నుండి తిరిగి వస్తున్న సమయంలో వారి చేదు అనుభవాలను వివరిస్తూ ఆ సంఘటనలో వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అనంతనాగ్ ప్రాంతంలో వారు బస్సు ఆపి, దాబా దగ్గర భోజనం చేసిన తరువాత తిరిగి బస్సులోకి ఎక్కగానే దాడి ప్రారంభమైందని తెలిపారు. దాదాపు 23 సంవత్సరాల్లోపు వయస్సున్న కొంతమంది యువకులు వచ్చి మూడు గ్రానైడ్లను…
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి నిఘా వైఫల్యమే కారణమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ దాడిని ఊచకోతగా ఆయన అభివర్ణించారు. బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఇది ఉరి ప్రాంతం, పుల్వామా సంఘటనల కంటే ప్రమాదకరమైందని, బాధాకరమైందన్నారు. ఈ సంఘటనపై నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాని డిమాండ్ చేశారు.
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. ఈ దాడికి బాధ్యతను టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ తీసుకుంది. ఈ సంస్థ పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'గా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్లో లష్కరే, టీఆర్ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక ఉగ్రవాది సైఫుల్లా…
Global Terrorism Index 2025: పాకిస్తాన్ మరోసారి తనకు ‘‘టెర్రరిజం’’లో తిరుగు లేదని నిరూపించుకుంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్(GTI) -2025లో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో ఉండగా, మూడో స్థానంలో సిరియా ఉంది. పాక్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా అవతరించింది. ఉగ్రవాద దాడుల్లో భారీ పెరుగుదల, పౌరుల మరణాల సంఖ్య పెరగడం వలన పాక్ రెండో స్థానానికి చేరుకుంది.