Pahalgam Attack : పహల్గామ్ ఉగ్రదాడి.. తెలంగాణలో హై అలెర్ట్
- తెలంగాణలో హై అలర్ట్
- ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు
- కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తం
- హైదరాబాద్ సహా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Attack : పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో తెలంగాణలో హై అలెర్ట్ ప్రకటించబడింది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల అవకాశాలపై వచ్చిన విశ్వసనీయ సమాచారంతో రాష్ట్ర పోలీసు శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని హెచ్ఐసీసీ, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో కఠినమైన భద్రతా చర్యలు చేపట్టబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి (CS) శాంతికుమారి, రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అలెర్ట్ చేయగా, డీజీపీ అనjani కుమార్ రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ చర్యలతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం సహా అన్ని ప్రత్యేక నిఘా బృందాలు సైతం అప్రమత్తమయ్యాయి.
Pahalgam Terror Attack: నష్టపరిహారం చెల్లించకపోయినా పర్వాలేదు కానీ, కాశ్మీర్లో మార్పు తీసుకరండి!
Also Read
- Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ఏప్రిల్ 25, 26 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న భారత్ సమిట్ రాజకీయ, ఆర్థిక పరంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశం. ఈ సమిట్లో రాహుల్ గాంధీతో పాటు సుమారు 100 దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. అలాగే, మే 7 నుంచి ప్రారంభమయ్యే మిస్ వరల్డ్-2025 పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి అందాల రాణులు హాజరుకానుండటం భద్రతా సంస్థలకు మరో సవాలుగా మారింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాల నేపథ్యంలో పోలీసు శాఖ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. గతంలో ఉగ్రవాద దాడులకు గురైన ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్లు తదితర ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది నిశిత నిఘా కొనసాగిస్తున్నారు.
కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అనుమానితులపై సమాచారం సేకరించడంలో నిమగ్నమై ఉంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేయడంతో పాటు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా పెంచారు. ప్రజలు ఏవైనా అనుమానాస్పద చర్యలు గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో, భద్రతా వ్యవస్థ మరింత సమర్థంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జాతీయ స్థాయిలో ఉన్న భద్రతా హామీని నిలుపుదల చేయడమే లక్ష్యంగా అధికారులు ముందస్తు ప్రణాళికను అమలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!