Supreme Court: ఉగ్ర సంస్థ ‘‘సిమి’’ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు..
- ఉగ్రసంస్థ సిమిపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్..
- పిటిషన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై విధించిన నిషేధాన్ని ఐదేళ్ల పాటు పొడిగించే ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాకలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 3(1) కింద సిమిని “చట్టవిరుద్ధ సంఘం”గా ప్రకటిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ సిమి కి చెందిన మాజీ సభ్యుడు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) ట్రిబ్యునల్ జూలై 24, 2024న ఇచ్చిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను విచారించడానికి న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సిమిపై నిషేధాన్ని 5 ఏళ్లు పొడగించాలని కేంద్రం జనవరి 29, 2024లో నిర్ణయించిన తర్వాత యూఏపీఏ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడింది. సిమిని నిషేధిత సంస్థగా ప్రకటించడానికి తగిన కారణం ఉందా లేదా అనే దానిపై తీర్పు ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేశారు.
Also Read
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
- CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
సిమిని మొదటిసారిగా సెప్టెంబర్ 2001లో నిషేధించారు. నేటికి ఆ నిషేధం కొనసాగుతోంది. నిషేధాన్ని చివరసారిగా 2024లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన ద్వారా పొడిగించారు. ఈ సంస్థ ఉగ్రవాదానికి, మత విద్వేశాన్ని పెంచిపోషిస్తోందని, సామస్యాన్ని దెబ్బతీస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
సిమి పిటిషనర్ తరుపున వాదిస్తున్న న్యాయవాది, ఇప్పటికే 10 కేసులు పెండింగ్లో ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ సిమి మాజీ సభ్యుడని చెప్పినప్పుడు, ‘‘ అయితే మీరు ఎందుకు వచ్చారు..? సంస్థనే రానివ్వండి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. సంస్థ ఉనికిలో లేదని న్యాయవాది కోర్టుకు తెలియజేసినప్పుడు, ‘‘ అప్పుడు అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?’’ అని అడిగింది. జమైత్-ఇ-ఇస్లామి-హింద్ (జెఇఐహెచ్)పై విశ్వాసంతో యువత మరియు విద్యార్థుల ఫ్రంట్ ఆర్గనైజేషన్గా సిమిని ఏప్రిల్ 25, 1977న అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో స్థాపించారు. అయితే, ఆ సంస్థ 1993లో ఒక తీర్మానం ద్వారా తనను తాను స్వతంత్రంగా ప్రకటించుకుంది.
తాజావార్తలు
-
Chairman’s Desk: మోడీ నాలుగోసారి ప్రధాని అవుతారా? బీజేపీకి మళ్లీ అధికారం దక్కుతుందా?
-
Divyendhu Sharma : తెలుగులో అదరగొట్టిన మీర్జాపూర్ మున్నా
-
Peddi Pre Release Event: నేను పుట్టింది ఎంత నిజమో.. ‘పెద్ది’ ఇండస్ట్రీని షేక్ చేయడం అంతే నిజం: జగపతి బాబు
-
Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
-
ICC Board Meeting: సంచలన నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. ఆ దేశ క్రికెట్ బోర్డు సభ్యత్వం రద్దు..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!