Supreme Court: ఉగ్ర సంస్థ ‘‘సిమి’’ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు..
- ఉగ్రసంస్థ సిమిపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్..
- పిటిషన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై విధించిన నిషేధాన్ని ఐదేళ్ల పాటు పొడిగించే ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాకలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 3(1) కింద సిమిని “చట్టవిరుద్ధ సంఘం”గా ప్రకటిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ సిమి కి చెందిన మాజీ సభ్యుడు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) ట్రిబ్యునల్ జూలై 24, 2024న ఇచ్చిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను విచారించడానికి న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సిమిపై నిషేధాన్ని 5 ఏళ్లు పొడగించాలని కేంద్రం జనవరి 29, 2024లో నిర్ణయించిన తర్వాత యూఏపీఏ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడింది. సిమిని నిషేధిత సంస్థగా ప్రకటించడానికి తగిన కారణం ఉందా లేదా అనే దానిపై తీర్పు ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేశారు.
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
సిమిని మొదటిసారిగా సెప్టెంబర్ 2001లో నిషేధించారు. నేటికి ఆ నిషేధం కొనసాగుతోంది. నిషేధాన్ని చివరసారిగా 2024లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన ద్వారా పొడిగించారు. ఈ సంస్థ ఉగ్రవాదానికి, మత విద్వేశాన్ని పెంచిపోషిస్తోందని, సామస్యాన్ని దెబ్బతీస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
సిమి పిటిషనర్ తరుపున వాదిస్తున్న న్యాయవాది, ఇప్పటికే 10 కేసులు పెండింగ్లో ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ సిమి మాజీ సభ్యుడని చెప్పినప్పుడు, ‘‘ అయితే మీరు ఎందుకు వచ్చారు..? సంస్థనే రానివ్వండి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. సంస్థ ఉనికిలో లేదని న్యాయవాది కోర్టుకు తెలియజేసినప్పుడు, ‘‘ అప్పుడు అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?’’ అని అడిగింది. జమైత్-ఇ-ఇస్లామి-హింద్ (జెఇఐహెచ్)పై విశ్వాసంతో యువత మరియు విద్యార్థుల ఫ్రంట్ ఆర్గనైజేషన్గా సిమిని ఏప్రిల్ 25, 1977న అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో స్థాపించారు. అయితే, ఆ సంస్థ 1993లో ఒక తీర్మానం ద్వారా తనను తాను స్వతంత్రంగా ప్రకటించుకుంది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!