Assam: “ఉగ్రదాడి ప్రభుత్వ కుట్ర”.. పాకిస్థాన్కు మద్దతు పలికిన ముస్లిం ఎమ్మెల్యేపై దేశ ద్రోహం కేసు!
- పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి
- ఈ దాడిని ఖండిస్తున్న ప్రపంచ దేశాలు
- పాకిస్థాన్కు మద్దతు పలికిన అస్సాం ఎమ్మెల్యే
- దేశద్రోహం కింద కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులపై కాల్పులు జరపగా.. మొత్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని భారత్తో పాటు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. కానీ.. ఈ దాడిపై అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ పాకిస్థాన్కు మద్దతు పలికాడు. ప్రస్తుత పెహల్గామ్ ఉగ్రదాడి, అంతకుముందు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటనలను ప్రభుత్వ కుట్రలో భాగమేనని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
READ MORE: Hyderabad: నేడే హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. విజయం ఎవరిది?
Also Read
దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై దేశదోహ్రం కేసు నమోదు చేసినట్లు సీఎం హిమంత వెల్లడించారు. బీఎన్ఎస్ 152/196/197(1)/113(3)/352/353 సెక్షన్లు కింద కేసు నమోదైంది. మరోవైపు.. అమినుల్ వ్యాఖ్యలపై ఏఐయూడీఎఫ్ పార్టీ స్పందించింది. ఇతను చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ వ్యాఖ్య తన వ్యక్తిగతమని చెప్పుకొచ్చింది. పాకిస్థాన్కు వత్తాసు పలుకుతూ మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు.
READ MORE: Pawan Kalyan : ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇది
తాజావార్తలు
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!