పండుగల సందర్భాల్లో కంపెనీలు ఒకట్రెండు నెలల జీతం బోనస్గా ఇస్తేనే ఆ ఉద్యోగులు ఎంతగానో సంబరపడతారు. మరి అలాంటింది ఊహించని గిఫ్ట్ వస్తే.. ఆ ఉద్యోగులు ఎగిరి గెంతేస్తారు కదా! ప్రస్తుతం అలాంటి మధురానుభూతినే ఎంజాయ్ చేస్తున్నారు చెన్నైలో ఓ ఐటీ కంపెనీలో పని చేసే కొందరు ఉద్యోగులు.
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వనవాసం ముగిసిందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి వెల్లడించారు. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్.. నిన్న తెలంగాణలో కాంగ్రెస్ .. రేపు ఏపీలో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వై నాట్ ఏపీ కాంగ్రెస్ అనేది మా నినాదమని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 కేసీఆర్ అని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మోసగాడు అని అందరు మోసగాళ్లు అనుకుంటే ఏట్లా కేటీఆర్ అని జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నెల రోజులోనే హామీలని అమలు చేయలేదని కాంగ్రెస్ 420 అని కేటీఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మొదటగా దళితులని మోసం చేసారని ఆయన వ్యాఖ్యానించారు. దళితులకు మూడు ఎకరాల…
రజక, నాయీ బ్రాహ్మణులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రజక, నాయీ బ్రాహ్మణులకు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి లాండ్రీలు, ధోబీ ఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. వాషర్ మెన్ లో లబ్ధిదారుల సంఖ్య 76,060 కి 78.55 కోట్లు, నాయి బ్రహ్మణ…
AP CM Jagan: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ ఇవాళ కలిసారు. ఇటీవల తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్ను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు.
ఢిల్లీ ఎయిమ్స్లో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. టీచింగ్ బ్లాక్లో ఇవాళ తెల్లవారుజామున ఎయిమ్స్ ఆస్పత్రిలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి.. అగ్ని ప్రమాదంలో ఫర్నీచర్, ఆఫీసు రికార్డులు దగ్ధం అయ్యాయి.
సగం ఆడ-సగం మగ లక్షణాలున్న అరుదైన పక్షిని మీరు చూశారా? దీన్ని న్యూజిలాండ్ శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ మాట్లాడుతూ.. కొలంబియాలో ఇలాంటి అరుదైన పక్షిని గుర్తించినట్లు పేర్కొన్నారు.
పాకిస్థాన్ ప్రభుత్వం చేపట్టిన బహిష్కరణ డ్రైవ్లో భాగంగా ఇప్పటికే 5 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించినట్లు పాక్ హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటు ఎగువ సభ (సెనేట్)కి తెలియజేసింది.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని ఆర్టీసీ విజయవంతంగా అమలు చేయడానికి నిధులు ఇస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా చార్జీల భారం మోపకుండా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన దృష్టి పెట్టి.. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)పై రవాణా, బీసీ…
నాలుగేళ్ల క్రితం అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీని హతమార్చింది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా సమాధి దగ్గర నివాళులు అర్పించేందుకు ప్రజలు గుమికూడిన సమయంలో రెండు పెద్ద బాంబు పేలుళ్లు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పేలుడులో కనీసం 100 మందికి పైగా మరణించగా.. 170 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. జనవరి 3, 2020న ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలో ఖాసిం సులేమానీని అమెరికా చంపినప్పుడు, కాన్వాయ్లోని రెండు కార్లు…