తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ స్థాయి సంస్థ ముందుకొచ్చింది. రూ. 6 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్స్ తయారీ యూనిట్లను నెలకొల్పడానికి దిగ్గజ సంస్థ రెన్యూ సిస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం నాడు ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్ సిటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఆ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పందంపై…
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీలోకి చేరికల హోరు కొనసాగుతుంది. తాజాగా.. కొందరు వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. గన్నవరం నియోజకవర్గ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ విధానాలు నచ్చి అనేక మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు.. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
తెలంగాణలో గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కాసేపటి క్రితమే విడుదలైంది. కాగా.. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. మొత్తం 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 నుండి మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే లేదా జూన్ లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్స్ పరీక్ష ఉండనుంది. అయితే.. ఇంతకు ముందు…
తెలంగాణలో పత్తి కొనుగోళ్ళను కొనసాగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ను కోరారు. ఈ వాన కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 44.92 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారని.. 25.02 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగలదని అంచనా వేసినట్లు చెప్పారు. తదనుగుణంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 285 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 8569.13 కోట్లు వెచ్చించి.. 12.31 లక్షల…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో విజయ సంకల్ప యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పదేళ్లుగా మోసం చేసిందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఇక బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మాదిరిగా చీకటి రాజకీయాలు మేం చేయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని కిషన్ రెడ్డి…
రేపటి నుంచి తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టనుంది. అందుకు సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రలు రేపటి నుండి వచ్చే నెల 2 వరకు జరుగుతాయని తెలిపారు. మొత్తం 5 యాత్రలు ఉంటాయని అన్నారు. రేపు 4 యాత్రలు ప్రారంభం అవుతాయని.. ఆ తర్వాత కాకతీయ భద్రాద్రి క్లస్టర్ యాత్ర తరవాత ప్రారంభం అవుతుందని చెప్పారు. కాగా..…
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. పాత నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం వెబ్నోట్ను విడుదల చేసింది. 563 పోస్ట్లతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ వేయనుంది. కాగా.. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వగా.. పేపర్ లీక్ కావడంతో గ్రూప్ -1 రద్దు అయింది.
మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా.. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ఇందుకోసం ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలోని చారిత్రక…
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు ఢిల్లీ వెళ్లారు. కాసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో సీఎం, డిప్యూటి సీఎం, మంత్రి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై హైకమాండ్తో రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. మరోవైపు.. పలువురు కేంద్ర మంత్రులను కూడ…
విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ఇద్దరు డీఈలపై వేటు పడింది. హైదరాబాద్ గచ్చిబౌలి డీఈ గోపాలకృష్ణ, మిర్యాలగూడ డీఈ వెంకటేశ్వర్లు సస్పెన్షన్ అయ్యారు. కాగా.. ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర విద్యుత్ సరఫరాలో గోపాలకృష్ణ నిర్లక్ష్యం బయటపడంతో అతన్ని సస్పెండ్ చేశారు. ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి డీఈగా గోపాలకృష్ణ దీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. అయితే ఆయనపై ఇంతకుముందు కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ.. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన అలానే కొనసాగాడు. కానీ ఈసారి మాత్రం ఆయన చర్యలను…